పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా `ఆదిపురుష్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఈ మైథలాజికల్ విజుల్ వండర్ లో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడుగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఎన్నో అంచనాల నడుమ జూన్ 16న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి.
అదే సమయంలో ఆదిపురుష్ పై అనేక విమర్శలు, వివాదాలు కూడా ఏర్పడ్డాయి. అయితే టాక్ ఎలా ఉన్నా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దుమారం రేపుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 300 కోట్ల క్లబ్ లో చేరింది. అయితే తాజాగా ఆదిపురుష్ తో ప్రభాస్ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సినిమాలు ఓవర్సీస్ లో ఎక్కువగా 2 మిలియన్ డాలర్ కలెక్షన్లను సాధించాయి.
ఈ జాబితాలో మహేష్ సినిమాలు 4 ఉంటే.. రజనీ సినిమాలు కూడా 4 ఉన్నాయి. అయితే ఈ హీరోలిద్దరి పేరిట ఉన్న రేర్ రికార్డ్ ను ప్రభాస్ చిత్తు చిత్తు చేశాడు. ఆదిపురుష్ తో 2 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాల జాబితాలో తన చిత్రాలు 5 ఉండేలా రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. ఏదేమైనా మిక్స్డ్ టాక్ వచ్చిన ఆదిపురుష్ తో ప్రభాస్ ఇలాంటి ఘనతను సొంతం చేసుకున్నాడు అంటే.. ఇతర హీరోలకు ఇది మైంబ్ బ్లాక్ అయ్యే షాక్ అనే చెప్పాలి.