భోళా శంకర్ చిత్రంపై షాకింగ్ కామెంట్లు చేసిన శ్రీ రెడ్డి..!!

టాలీవుడ్లో సీనియర్ హీరోలలో చిరంజీవికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. తాజాగా చిరంజీవి నటిస్తున్న చిత్రం భోళా శంకర్ ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా తమిళ సినిమా ఆయన వేదాళం సినిమాకు రీమిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిన్నటి రోజున ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో చిరంజీవి చెప్పే డైలాగులు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. చిరంజీవికి జోడిగా తమన్న నటిస్తుండగా.. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది.

ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న చిరంజీవి ఇదే ఊపు మీద భోళా శంకర్ సినిమాని ఆగస్టు 11వ తేదీన విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. తాజాగా టాలీవుడ్ నటి శ్రీరెడ్డి భోళా శంకర్ సినిమా పైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది. భోళా శంకర్ సినిమా టీజర్లో కామెడీ ఏంట్రా అంటు రెచ్చిపోయి కామెంట్లు చేయడం జరుగుతోంది.. భోళా శేఖర్ టీజర్ లో కామెడీ ఏంటయ్యా అంటూ డైరెక్టర్ మెహర్ రమేష్ పైన ఫైర్ అవుతోంది శ్రీరెడ్డి..

సొంతంగా నువ్వేదో కథ రాసుకొని సినిమా చేస్తున్నట్టు( A FILME BY MEHER RAMESH )మెహర్ రమేష్ తన పేరును వేసుకున్నాడంటూ చురకలంటించింది…వీళ్ళు చేసేది రీమిక్స్ సినిమాలు అందులో దానికి ట్యాగ్ లైన్ కూడా అవసరమా అంటూ ప్రశ్నిస్తోంది..ఒకవేళ ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే ఉంటుంది నా సామి రంగ అంటూ రెచ్చిపోయి కామెంట్లు చేసింది శ్రీరెడ్డి. ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి