రూ.50 వేల కోట్లు ఏం చేస్తారో.. జగన్‌పై సినీ నటుడు శివాజీ కీలక వ్యాఖ్యలు..

మొదట సైడ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా నటిస్తూ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు శివాజీ. శ్రీరామచంద్రులు, మిస్సమ్మ, అమ్మాయి బాగుంది, మిస్టర్ ఎర్రబాబు, టాటా బిర్లా మధ్యలో లైలా లాంటి సినిమాలతో ఈ హీరో తెలుగు వారిని బాగా అలరించాడు. శివాజీ సినిమాల పరంగా అందరి మనసులను దోచేశాడు. కానీ రాజకీయాలలో మాత్రం బాగా విమర్శలు చేస్తూ షాకులు ఇస్తున్నాడు. ముఖ్యంగా సీఎం జగన్ పై ఈ నటుడు అలుపే లేకుండా విమర్శలు గుప్పిస్తుంటాడు. ఇప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూలో జగన్ పార్టీ 2024 అసెంబ్లీ ఎన్నికలలో గెలవదని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

వైసీపీకి దాని రాజకీయ అవసరాలు దానికి ఉంటాయని, వాళ్ల వ్యూహం కూడా తప్పని తాను అనుకోనని లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సీఎం జగన్ కి ఇప్పుడు ఉన్న సమయం చాలా విలువైనదని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన మారాలని శివాజీ అన్నాడు. కేంద్రం నుంచి ఏపీకి ఇటీవల కాలంలో రూ.50వేల కోట్లు ముట్టాయని శివాజీ ఆరోపించాడు. ఆ డబ్బులన్నీ జగన్ ఏం చేస్తారో చూడాలని పేర్కొన్నాడు. ఇప్పుడున్న కాలంలో జగన్ కి, ప్రజలకి మధ్య ఒక పోటీ లాంటిది జరుగుతుందని అతడు అన్నాడు. కరెంట్ బిల్లులు తగ్గించాలని ప్రజలు గగ్గోలు పెడుతున్నట్లు శివాజీ తెలిపాడు.

ఇక బాలకృష్ణ గురించి కూడా శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బాలకృష్ణ ఒక భోళా శంకరుడు అని, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కనుక అతను ఎమ్మెల్యేగా గెలవగలిగాడని తెలిపాడు. కాగా శివాజీ జగన్ గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చినీయాంశమయ్యాయి.