ఆ విష‌యంలో బెంగ పెట్టుకున్న స‌మంత‌.. పెద్ద‌ స‌మ‌స్యే వ‌చ్చింది!?

సౌత్ స్టార్ బ్యూటీ సమంత భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత కెరీర్ పరంగా మరింత జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీ షెడ్యూల్ మెయింటైన్ చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు విజయ్ దేవరకొండకు జోడిగా `ఖుషి` సినిమాలో నటిస్తోంది. శివ నిర్మాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ఇది.

అలాగే మరోవైపు బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో `సిటాడెల్‌` అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయ. అయితే అంతా బాగానే ఉన్నా స‌మంత‌కు ఇప్పుడు పెద్ద స‌మ‌స్య వ‌చ్చింద‌ట‌. అదేంటంటే.. స్టార్ హీరోలు సమంత ను పట్టించుకోవడం లేదట. ప్రస్తుతం ఈ విషయంలో సమంత బెంగ పెట్టుకుందని అంటున్నారు.

కొన్నేళ్లు ముందు వ‌ర‌కు టాలీవుడ్ టాప్ హీరోలకు స‌మంత మోస్ట్ వాంటెడ్ గా ఉండేది. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మొత్తం మారిపోయింది. టాప్ స్టార్స్ ఎవ్వరు సమంత వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఒకవేళ దర్శక నిర్మాతలు సమంతను రిఫర్ చేసినా.. నో నో అనేస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం టైర్‌-2 హీరోలు, యంగ్ స్టార్స్ సినిమాల నుంచే సమంతకు ఆఫర్లు వ‌స్తున్నాయ‌ట‌. దీంతో స‌మంత ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. ఎవరు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా తన మార్క్ చూపించాల‌ని భావిస్తుంద‌ట‌. అందుకే క‌థ మ‌రియు త‌న పాత్ర న‌చ్చితే ఏ హీరో సినిమాకు అయినా గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుంద‌ట‌. ఇందులో భాగంగానే రీసెంట్ గా యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డతో ఓ మూవీకి క‌మిట్ అయింద‌ని టాక్ న‌డుస్తోంది.