టాలీవుడ్లో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్. ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. బాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. అలాగే జగపతిబాబు కూడా నటిస్తున్నట్లు సమాచారం సలార్ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి అభిమానులలో ఫుల్ జోష్ నింపే విధంగా అప్డేట్లను సైతం చిత్ర బృందం తెలియజేస్తూనే ఉంది.
ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి టీజర్ విడుదలవుతుందా అంటూ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఎట్టకేలకు టీజర్ టైం ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సలార్ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను జులై నెలలో లేకపోతే ఆగస్టు 15న విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా టీజర్ ఎలా ఉండబోతుందో అంటూ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న ఈ ఏడాది విడుదల కాబోతోంది.
సలార్ రెండు భాగాలుగా రాబోతోందంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమా సీక్వెల్ ప్రాజెక్టును ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారనే విషయంపై ఇంకా చిత్రబృందం క్లారిటీ ఇవ్వలేదు. ప్రభాస్ నటించిన ఆది పురుష్ చిత్రం ఈనెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పనంగా కూడా తన స్టామినాన్ని చూపిస్తున్నారు ప్రభాస్. ఇక అలాగే మరొక సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్-K, మారుతి దర్శకత్వంలో రాజా డీలర్స్ వంటి చిత్రాలలో నటిస్తూ ఉన్నారు.