నరేష్‌లో అది చూసే పవిత్ర పెళ్లి చేసుకుందంటూ కాంట్రవర్షల్ కామెంట్స్ చేసిన నటుడు!

గత కొంతకాలంగా నరేష్, పవిత్రల ప్రేమ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇటీవల వారిద్దరూ కలిసి ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమాలో కూడా నటించారు. వారి పెళ్లి వీడియోని స్వయంగా నరేష్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. అయితే నరేష్‌కి పవిత్రతో ఇది నాలుగవ పెళ్లి. ఇక పవిత్రకేమో సెకండ్ మ్యారేజ్. గత కొద్ది రోజులుగా వీరు పెళ్లి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

అయితే ఈ పెళ్లి వీడియో నిజమే అని కొంతమంది నమ్ముతుంటే, మరి కొంతమందేమో ఏదో సినిమాలో నరేష్, పవిత్ర కలిసి పెళ్లి చేసుకున్నట్లు నటించి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవిత్ర లోకేష్ మొదటి భర్త చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పవిత్ర లోకేష్ మొదటి భర్త కన్నడ సీరియల్ యాక్టర్ సుచేంద్ర ప్రసాద్. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లయిన కొంతకాలానికి వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో భర్త నుంచి వేరుగా ఉంటుంది పవిత్ర. ఇక ఇప్పుడేమో నరేష్ తో చెట్టాపట్టాలేసుకొని ప్రేమ పక్షుల్లా తిరగటం మొదలు పెట్టింది.

నరేష్, పవిత్రల పెళ్లి వీడియో వైరల్ అవ్వడంతో, ఈ వీడియో గురించి పవిత్ర మొదటి భర్త సుచేంద్ర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆయన కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టారు. పవిత్ర లోకేష్ ఒక అవకాశవాది అని, విజయనిర్మల గారు కష్టపడి సంపాదించిన రూ.150 కోట్లను నొక్కేయడానికే నరేష్ తో తిరుగుతుందని సుచేంద్ర వెల్లడించారు. నరేష్, పవిత్ర ఇద్దరూ కలిసి విజయనిర్మల గారి సొమ్ముని జల్సాలు చేస్తూ కరగదీస్తున్నారంటూ సుజేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవిత్రకి లగ్జరీ లైఫ్ అంటే ఇష్టమని, ఆమెకి కేవలం డబ్బుంటే చాలని, సుచేంద్ర దగ్గర డబ్బు లేకపోవడంతో మరొకరి దగ్గరకు వెళ్లిందని సుచేంద్ర ఆరోపణలు చేశారు. పవిత్ర, నరేష్ ల మధ్య ఉన్నది ప్రేమో, వ్యామోహమో తెలియదు కానీ, డబ్బుపై ఉన్న ఆశతో సుచేంద్రను పిల్లలను మోసం చేసిందని సుచేంద్ర అంటున్నారు. ప్రస్తుతం సుచేంద్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.