ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక క్రేజీ ని సంపాదించుకుంది హీరోయిన్ రష్మిక.. మొదట కిరాక్ పార్టీ అనే చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టాలీవుడ్ లో ఛలో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. కెరియర్ పరంగా తన కెరీర్ లో ఎన్నో టర్నింగ్ పాయింట్ అయ్యే సినిమాలలో నటించిన రష్మిక.. స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ఇటీవల పుష్ప చిత్రంలో నటించి పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించింది.
ఇలాంటి పాపులారిటీతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలు అందుకుంటోంది. రష్మిక బాలీవుడ్ లో సరైన సక్సెస్ అందుకోలేకపోతోంది. కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ కాలేకపోతోంది. రష్మిక ఇటీవలే రణబీర్ కపూర్ నటిస్తున్న యానిమల్ అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించేందుకు సిద్ధమయ్యింది. అయితే తాజాగా రష్మిక కు సంబంధించి ఒక విషయం వైరల్ గా మారుతోంది.
అదేమిటంటే రష్మికకు తెలియకుండా తన మేనేజర్ దాదాపుగా రూ .80 లక్షల దొంగలించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న రష్మిక వెంటనే మేనేజర్ ను ఉద్యోగం నుంచి తొలగించినట్టుగా సమాచారం. అతను చాలా కాలంగా రష్మిక వద్ద పనిచేస్తున్న వీరిద్దరి మధ్య మంచి సన్నిహిత అనుబంధాలు కలిగి ఉండడం చేత రష్మిక ఈ వార్తల పైన ఇప్పటికీ మౌనంగా ఉన్నట్టు సమాచారం. రష్మిక ఎంతో నమ్మి తనకు బాధ్యతలు అప్పగించిన తనను మోసం చేసినట్టుగా తెలుస్తోంది.ప్రస్తుతం రష్మిక పుష్ప-2 లో నటిస్తోంది గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.