హీరోలనే మించిపోయిన జ‌క్క‌న్న‌.. ఫ‌స్ట్ యాడ్ కు ఎన్ని కోట్లు ఛార్జ్ చేశాడో తెలిస్తే షాకే!

`ఆర్ఆర్ఆర్‌` వంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ అనంత‌రం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌న త‌దుప‌రి చిత్రాన్ని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్న సంగ‌తి తెలిసిందే. వీరి కాంబో ప్రాజెక్ట్ పై ఆల్రెడీ అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది. పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం మ‌రికొద్ది నెల‌ల్లో ఘ‌నంగా ప్రారంభం కాబోతోంది.

ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. రీసెంట్ గా జ‌క్క‌న్న ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ లో న‌టించాడు. ప్రముఖ మొబైల్ బ్రాండ్ ‘ఒప్పో’ కోసం రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. తాజాగా ఈ బ్రాండ్ యొక్క ప్ర‌మోష‌న‌ల్ యాడ్ లోనే రాజ‌మౌళి న‌టించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అందులో రాజ‌మౌళి స్టైలిష్ లుక్ అంద‌రినీ ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. రాజ‌మౌళి త‌న కెరీర్ లో న‌టించిన ఫ‌స్ట్ యాడ్ ఇది. అయితే ఈ యాడ్ కోసం ఆయ‌న ఎంత ఛార్జ్ చేశాడో తెలిస్తే షాకైపోతారు. ఎందుకంటే, ఒప్పో యాడ్ కోసం రాజ‌మౌళి ఏకంగా రూ. 3 కోట్లు రెమ్యున‌రేష‌న్ పుచ్చుకున్నాడ‌ట‌. యాడ్ షూట్ అంటే ఒక‌టి లేదా రెండు రోజులు ఉంటుంది. ఆ మాత్రానికే రాజ‌మౌళి మూడు కోట్లు తీసుకోవ‌డం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు నెటిజ‌న్లు రెమ్యున‌రేష‌న్ విష‌యంలో జ‌క్క‌న్న హీరోలనే మించిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.