టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలలో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. తాజాగా వారాహి విజయయాత్ర లో భాగంగా అవిశ్రాంతిగా పర్యటనలు చేస్తూ ఉండడంతోపాటు ఉపవాస దీక్ష పాటిస్తూ ఉండడంతో పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా అమీరంలో ఒక ఫంక్షన్ హాలులో పవన్ విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ కారణంగానే ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో భీమవరం నియోజకవర్గ నేతలతో చర్చించిన తర్వాత సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.మధ్యాహ్నం తర్వాతే ఈ భేటీ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారని విషయం తెలియగానే అభిమానులు చాలా ఆందోళనకు గురవుతున్నారు.అయితే స్వల్ప ఇబ్బంది మాత్రమే ఉన్నట్లు జనసేన పార్టీ వర్గ నేతలు తెలియజేయడం జరిగింది. దీంతో అభిమానులు కాస్త కుదుటపడ్డారని చెప్పవచ్చు సినిమా షూటింగులలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ వెంటనే వారాహి విజయ యాత్ర చేపట్టడం జరిగింది.
ప్రస్తుతం తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ సినిమాలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ నటించిన బ్రో జులై 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ చిత్రాన్ని సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్..డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజి వంటి సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అలాగే క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాని కూడా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ ఏడాది నుంచి వచ్చే ఏడాదిలోపు వరుసగా పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక్కొక్కటిగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.