నాగబాబు ముద్దుల కుమార్తె, నటి, నిర్మాత నిహారిక కొణిదెల తన విడాకులను దాదాపు కన్ఫర్మ్ చేసేసింది. 2020 లో చైతన్య జొన్నలగడ్డను నిహారిక వివాహం చేసుకుంది. నాగబాబు ఏరికోరి మరీ చైతన్యను అల్లుడుగా తెచ్చుకున్నాడు. రాజస్థాన్ లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది.
అయితే పెళ్లై మూడేళ్లు గడవక ముందే నిహారిక చైతన్య మధ్య మనస్పర్ధలు తలెత్తాయని.. విడాకులకు సిద్ధమయ్యారని గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. చైతన్య నిహారికల తీరు కూడా ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. ఇక గత రాత్రి నిహారిక అన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. హైదరాబాద్లో నాగబాబు నివాసంలోనే ఈ వేడుక ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది.
మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వరుణ్-లావణ్య నిశ్చితార్థంలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం బయటకు వచ్చాయి. అయితే నిహారిక భర్త చైతన్య మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఫ్యామిలీ ఫోటోల్లో సైతం నిహారిక ఒంటరిగానే దర్శనమిచ్చింది. సొంత బావమరిది నిశ్చితార్థానికి చైతన్య హాజరు కాకపోవడంతో.. అతనితో నిహారిక విడిపోయిందని నెటిజన్లు కన్ఫార్మ్ చేసేసుకుంటున్నారు. ఇంతకంటే ప్రూఫ్ ఇంకేం కావాలని చర్చించుకుంటున్నారు