తెలివంటే శ్రీ‌లీల‌దే.. ఏం చేసిందో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు?

ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు ఎంతలా మారుమోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఈ అమ్మడు ఇప్పటివరకు చేసింది రెండే సినిమాలే అయినా.. తనదైన అందం, అభినయం, నటనా ప్రతిభతో పాటు ఎనర్జిటిక్ డాన్సులతో స్టార్ హోదాను అందుకుంది. యంగ్ హీరోలకే కాకుండా స్టార్ హీరోలకు సైతం మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీ షెడ్యూల్ ను మైంటైన్ చేస్తుంది.

అయితే శ్రీలీల చేస్తున్న చిత్రాల్లో `గుంటూరు కారం` ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మాస్‌ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీలను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. కానీ ఇప్పుడు ఈ మూవీ నుంచి పూజా హెగ్డే తప్పుకుంద‌ని..దాంతో శ్రీలీలనే మెయిన్ హీరోయిన్ గా చేశారని వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే మొదట సెకండ్ లీడ్ రోల్ కోసం రూ. 70 లక్షలకు శ్రీలీలను మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు మెయిన్ హీరోయిన్ శ్రీ‌లీల‌నే అయింది. కానీ రెమ్యునరేషన్ ను మాత్రం పెంచలేదట. శ్రీలీల కూడా తన రెమ్యూనరేషన్ గురించి మాట్లాడకుండా తెలివిగా వ్యవహరించిందట. ఎందుకంటే మహేష్ మూవీలో మెయిన్ హీరోయిన్ రోల్ ఓ యంగ్ బ్యూటీకి రావ‌డం అంటే మామూలు విషయం కాదు. ఈ మూవీ తర్వాత శ్రీలీల‌ క్రేజ్ ట్రిపుల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే డబ్బు గురించి పట్టించుకోకుండా మహేష్ తో ఆడి పాడాలని డిసైడ్ అయిందట. ఈ విషయం తెలిసి నెటిజ‌న్లు ముక్కున వేలేసుకుంటున్నారు. కెరీర్ విష‌యంలో శ్రీలీల చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని చ‌ర్చించుకుంటున్నారు.