టాలీవుడ్ ఇండస్ట్రీలోని మెగా కుటుంబంలో త్వరలోనే పెళ్లి బజాలు మోగనున్నాయి. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్, ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. జూన్ 9న వీరి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో, బంధుమిత్రులు, స్నేహితుల దీవెనలతో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ ఎంగేజ్మెంట్లో నాగబాబు తన కొడుకు పట్ల ఉన్న అమితమైన ప్రేమతో ఒక క్లాసిక్ రోలెక్స్ వాచ్ను బహుమతిగా ఇచ్చాడని సమాచారం.
ఇక నాగబాబు భార్య పద్మజ తన ఇంట్లో అడుగుపెట్టనున్న తన ముద్దుల కోడలికి డైమండ్ నెక్లెస్ను బహుమతిగా ఆఫర్ చేసిందని తెలుస్తోంది. అంతేకాకుండా తన ఇంటి మహాలక్ష్మిగా లావణ్యను భావించి చాలా ఖరీదైన ఆరంజ్ కలర్ సిల్క్ శారీని కూడా గిఫ్ట్ గా ఇచ్చిందట పద్మజ. అత్తగారు ఇచ్చిన కాస్ట్లీ శారీని లావణ్య ఎంగేజ్మెంట్కి ముందు తొడుక్కుందు. ఎంగేజ్మెంట్ వేడుకల్లో మాత్రం గ్రీన్ శారీ మెరిసింది. ఆకుపచ్చ రంగు గల పట్టుచీరలో ఆమె వరుణ్ తేజ్ తో కలిసి నిశ్చితార్థం చేసుకుంది.
ఇక మెగాబ్రదర్ నాగబాబు ఇచ్చిన చేతి గడియారం క్లాసిక్ డిజైన్తో అద్భుతంగా ఉందని సమాచారం. ఈ ఖరీదైన గిఫ్ట్స్ అనేవి నాగబాబు, పద్మజ తమ కొడుకుపై ఉన్న ప్రేమను చూపడమే కాకుండా, వారికన్నా డబ్బులు తమకు ఎక్కువ కాదు అని ఇన్డైరెక్ట్గా చెప్పినట్లు ఉంది. అలానే ఖరీదైన బహుమతులు అందించి కొణిదల కుటుంబంలోకి లావణ్యని స్వాగతించారు మెగా కుటుంబం.