పూజా హెగ్డేకు బిగ్ షాకిచ్చిన మృణాల్.. ఇక బుట్ట‌బొమ్మ ప‌ని అయిపోయిన‌ట్లేనా?

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే వ‌రుస ఫ్లుపుల‌తో కెరీర్ ప‌రంగా బాగా న‌లిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. రాధేశ్యామ్‌, ఆచార్య‌, బీస్ట్‌, స‌ర్క‌స్‌, కిసీ కా భాయ్ కిసీ కి జాన్.. ఇలా పూజా హెగ్డే న‌టించిన ప్ర‌తి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్తా ప‌డింది. దీంతో ఆమెను ఐర‌న్ లెగ్ అని కూడా ట్రోల్ చేశారు. ఆఫ‌ర్లు కూడా బాగా త‌గ్గాయి.

ఇక ఇలాంటి త‌రుణంలో పూజా హెగ్డేకు టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా న‌టించే గోల్డెన్ ఛాన్స్ వ‌చ్చిందంటూ రెండు రోజుల నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌ ప‌రుశురామ్ కాంబోలో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి విధిత‌మే. `గీత గోవిందం` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం వీరిద్ద‌రూ కాంబోలో రాబోతున్న రెండో సినిమా ఇది.

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌బోతోంది. అయితే ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా పూజా హెగ్డేను ఎంపిక చేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ, పూజా హెగ్డేకు ద‌క్కాల్సిన ఆ ఆఫ‌ర్ ను `సీతారామం` బ్యూటీ మృణాల్ ఠాకూర్ కొట్టేసి షాకిచ్చింది. మేక‌ర్స్ మొద‌ట పూజా హెగ్డేనే హీరోయిన్ గా అనుకున్నా.. ఆమె వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న కార‌ణంగా మ‌న‌సు మార్చుకున్నార‌ట‌. ఆఖ‌రి నిమిషంలో మృణాల్ ను పిక్స్ చేశార‌ట‌. దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుంద‌ని అంటున్నారు. ఈ విష‌యం తెలిసి ఇక బుట్ట‌బొమ్మ ప‌ని అయిపోయిన‌ట్లే.. ఆమె కెరీర్ ముగిసిన‌ట్లే అని మాట్లాడుకుంటున్నారు.