ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న మంచు మ‌నోజ్‌.. వెల్లువెత్తుతున్న ప్ర‌శంస‌లు!

మంచు మ‌నోజ్ ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నాడు. రామాయ‌ణం ఆధారంగా రూపుదిద్దుకున్న మైథ‌లాజిక‌ల్ విజువుల్ వండ‌ర్ ‘ఆదిపురుష్’ సినిమా నిన్న ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు ఏడు వేల థియేట‌ర్స్ లో విడుద‌లైంది. కొన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఫ్యాన్స్‌, ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక‌పోతే కొంత మంది సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని నిరు పేదలకు, అనాథలకు ఉచితంగా చూపించాలని నిర్ణయించుకున్న సంగ‌తి తెలిసిందే.

ఇందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ 10వేల టికెట్స్, అభిషేక్ అగర్వాల్ 10వేల టికెట్స్, టీ సిరీస్ ఏకంగా 12 వేల టికెట్స్ కొనుగోలు చేసింది. అలాగే టాలీవుడ్ లో మంచు మ‌నోజ్ కూడా 2500 టిక్కెట్స్ ను కొనుగోలు చేశాడు. ఈ లిస్ట్ లో మంచు మ‌నోజ్ ఒక‌డు. తెలుగు రాష్ట్రాల్లోని పలు అనాథ శరణాలయాల్లో ఉంటున్న 2500 పిల్లలకు ‘ఆదిపురుష్’ సినిమాను ఫ్రీగా చూపించేందుకు మనోజ్, ఆయ‌న భార్య మౌనిక ఏర్పాట్లు చేశారు.

దీని కోసం రెండు ప్రైవేటు సంస్థలతో చేతులు కలిపిన‌ట్లు ఇటీవ‌ల మంచు మ‌నోజ్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించాడు. అయితే చెప్పిన‌ట్లుగానే నిన్న మ‌నోజ్ దంప‌తులు నిన్న‌ అనాథ పిల్లలతో కలిసి ఆదిపురుష్ సినిమాను చూశారు. ప్రసాద్ ఐమాక్స్ లో అనాథ పిల్లలతో ఆదిపురుష్ సినిమాను వీక్షించిన మనోజ్ దంపతుల యొక్క ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. దీంతో నెటిజ‌న్లు మ‌నోజ్ దంప‌తుల గొప్ప మ‌న‌సుపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇచ్చిన నిల‌బెట్టుకున్నారు అంటూ వారిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.