నిహారిక కాపురం చక్కదిద్దేందుకు లావ‌ణ్య త్రిపాఠి అంత పెద్ద త్యాగం చేసిందా.. నిజంగా గ్రేట్‌!?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, ప్ర‌ముఖ హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి త్వ‌ర‌లోనే వైవామిక జీవితంలోకి అడుగు పెట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మిస్ట‌ర్‌, అంత‌రిక్షం చిత్రాల్లో జంట‌గా న‌టించిన వ‌రుణ్‌, లావ‌ణ్య‌.. ఇప్పుడు రియ‌ల్ లైఫ్ లో జంట‌ కాబోతున్నాడు. కొన్నేళ్ల క్రిత‌మే మ‌న‌సులు ఇచ్చిపుచ్చుకున్న ఈ జంట‌.. ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక‌టి అవ్వాల‌ని డిసైడ్ అయ్యారు.

ఈ నేన‌ప‌థ్యంలోనే కుటుంబ‌స‌భ్యులు వీరి ఎంగేజ్మెంట్ డేట్ ను కూడా లాక్ చేశారు. జూన్ 9న వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి నిశ్చితార్థం అట్ట‌హాసంగా జ‌ర‌గ‌బోతోంది. ఈ ఏడాది చివ‌ర్లో వీరి వివాహ మ‌హోత్స‌వం ఉండ‌బోతోంది. అయితే నిజానికి గ‌త ఏడాదే వీరి పెళ్లి జ‌ర‌గాల్సి ఉంద‌ట‌. కానీ, నిహారిక కార‌ణంగా లావ‌ణ్య పెళ్లిని వాయిదా వేస్తూ వ‌స్తుంద‌ట‌. 2020లో చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌తో నిహారిక ఏడ‌డుగులు వేసింది.

వీరి పెళ్లి ఎంతో ఘ‌నంగా జ‌రిగింది. లావ‌ణ్య త్రిపాఠి కూడా వీరి పెళ్లికి హాజ‌రు అయింది. అయితే గ‌త కొద్ది నెల‌ల నుంచి నిహారిక‌, చైత‌న్య మ‌ధ్య స‌ఖ్య‌త లేదు. వ్య‌క్తిగ‌త విభేదాలతో దూరంగా ఉంటున్నారు. విడాకుల‌కు కూడా సిద్ధం అయ్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే నిహారిక లావ‌ణ్య త్రిపాఠికి కాబోయే ఆడ‌ప‌డుచు మాత్ర‌మే కాదు బెస్ట్ ఫ్రెండ్ కూడా. అందుకే ఆమె కాపురం చ‌క్క‌దిద్దిన త‌ర్వాతే పెళ్లి చేసుకుందామ‌ని వ‌రుణ్ తేజ్ కు చెప్పింద‌ట‌. అంతేకాదు నిహారిక‌-చైత‌న్య‌ను క‌లిపేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు కూడా చేసింద‌ట‌. కానీ, ఆమె ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం కాలేదు. పెళ్లి చేసుకోకుండా లావ‌ణ్య త్రిపాఠి ఏడాది కాలం నిహారిక కోసం త్యాగం చేసినా ఉప‌యోగం లేకుపోయింది. ఇక చేసేదేమి లేక వ‌రుణ్‌, లావ‌ణ్య పెళ్లికి సిద్ధం అయ్యార‌ని టాక్ న‌డుస్తోంది.