ప్రభాస్‌పై కృతి సనన్‌ హాట్ కామెంట్స్.. కొంపదీసి అఫైర్ నిజమేనా??

ప్రస్తుతం ఇండస్ట్రీలో డార్లింగ్ ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో ఉన్నారనే వార్త చక్కర్లు కొడుతుంది. అసలు ఎందుకు కృతి సనన్, ప్రభాస్‌లపై ఇలాంటి వార్తలు వస్తున్నాయనే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ‘బెడియా’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక షోకి కృతి సనన్, వరుణ్ దావన్‌లు హాజరయ్యారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఒక ఆసక్తికరమైన సంభాషణ నడిచింది. వీరితో పాటు కరణ్ జోహార్ కూడా ఆ షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వరుణ్ దావన్‌,కృతి సనన్‌పై ఒక కామెంట్ పాస్ చేశాడు.

ప్రస్తుతం కృతి సనన్ వేరే వారి మనసులో ఉంది. వారు ఇక్కడ లేరు, ముంబైలో దీపికతో పాటు షూటింగ్‌లో బిజీగా ఉన్నారని అన్నాడు వరుణ్. అయితే వరుణ్ డైరెక్ట్ గా ఆ వ్యక్తి పేరు చెప్పకపోయినా కచ్చితంగా ప్రభాస్ ని ఉద్దేశించే ఈ మాట అని ఉంటాడు అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో దీపికా పదుకొనే, ప్రభాస్ లు ఇద్దరూ హైదరాబాద్‌లో ‘ప్రాజెక్టు కే’ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఇక ఫిల్మ్ క్రిటిక్, ఓవర్సిస్ సెన్సార్ మెంబర్ ఉమర్ సంధు ఎన్నో సార్లు ప్రభాస్, కృతి ప్రేమలో ఉన్నారనే విషయంపై ట్వీట్ చేశాడు. అంతేకాకుండా కృతి సనన్, ప్రభాస్ త్వరలోనే మాల్దీవ్స్‌లో నిశ్చితార్ధం చేసుకోబోతున్నారని చెప్పాడు.

ఒకప్పుడు ప్రభాస్, కృతిల మధ్య ఎఫైర్ ఉందని బాలీవుడ్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. ఆ సమయంలో కృతి సనన్ ఈ రూమర్స్ ని కొట్టిపడేసింది. అయితే నిన్న తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో కృతి సనన్ ప్రభాస్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రభాస్ చాలా తక్కువ మాట్లాడతారని అంతా అనుకుంటారు కానీ ఆయన ఎప్పుడూ గలగలా మాట్లాడుతూనే ఉంటారు.

ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్. మంచి వ్యక్తి, అలానే భోజన ప్రియుడు కూడా. ఇక రాఘవుడు పాత్రని ప్రభాస్ తప్ప వేరే ఎవరు నటించలేరు అంటూ ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ విధంగా ప్రభాస్ పై ఉన్న ప్రేమను మరోసారి బయటపెట్టింది కృతి. ప్రస్తుతం కృతి సనన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కొంపదీసి వీరి మధ్య నిజంగానే అఫైర్ ఉందా అని చాలామంది తమ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఇకపోతే ఆదిపురుష్ సినిమా జూన్ 16న వరల్డ్ వైడ్‌గా ఐదు భాషల్లో విడుదల కాబోతుంది.