పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. జూన్ 16న ఈ చిత్రం అట్టహాసంగా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతోంది.
ఇకపోతే ప్రమోషన్స్ లో భాగంగా నిన్న రాత్రి తిరుపతిలో అదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో ఎప్పుడూ జరగనంత ఘనంగా తిరుపతి తారకరామా స్టేడియంలో దాదాపు రెండున్నర కోట్లు వెచ్చించి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆధ్యాత్మిక గురువు, శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి హాజరయ్యారు. అలాగే హీరోహీరోయిన్లు ప్రభాస్, కృతి సనన్తో పాటు చిత్రటీమ్ మొత్తం ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.
వేలాది మంది అభిమానుల మధ్య ఎంతో కోలాహలంగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సాగింది. ఈ సందర్భంగా ఆదిపురుస్ సెకెండ్ ట్రైలర్ గా కూడా బయటకు వదిలారు. ఇకపోతే ఈ ఈవెంట్ లో ప్రభాస్ సెక్యూరిటీ ఖర్చు తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మొత్తం వెయ్యి మంది పోలీసులు బందోబస్తుగా వచ్చారు. అలాగే మరొక వెయ్యి మంది ట్రాఫిక్ మరియు జనాల మానిటరింగ్ చేశారు. ఇక ప్రభాస్ కు ప్రత్యేకంగా ప్రైవేట్ సెక్యూరిటీ మరియు బాంబ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేశారు. పోలీసుల సెక్యూరిటీ కాకుండా ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నందుకే నిర్మాతలు ఏకంగా రూ. 25 లక్షలు ఖర్చు పెట్టారట. దీంతో ఇప్పుడీ విషయం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.