జగన్‌పై ట్రోల్స్.. వైసీపీ నేతలు బూతులు మాట్లాడారా?

ఏపీ సి‌ఎం జగన్ మోహన్ రెడ్డి..చేసిన పనులు, అభివృద్ధి ఏం చేస్తున్నామనే విషయాలు చెప్పడం కంటే ప్రతిపక్ష నేతలని వ్యక్తిగతంగా విమర్శలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎలాగో మంత్రులు గాని, వైసీపీ ఎమ్మెల్యేలుగాని..వారి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పరు కానీ..ఎవరైనా విమర్శలు చేస్తే వారిని తిట్టే కార్యక్రమం చేస్తారు. ఇక తాజాగా జగన్ కూడా కురుపాం సభలో అదే చేశారని విమర్శలు వస్తున్నాయి.

కురుపాంలో అమ్మఒడికి నిధులు విడుదల చేసే కార్యక్రమం జరిగింది..కానీ అక్కడ చంద్రబాబు, పవన్‌లపై జగన్ విరుచుకుపడ్డారు. ఇటీవల పవన్ వారాహి యాత్రతో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. గోదావరి జిల్లాల్లో వైసీపీ అక్రమాలు చేస్తుందని, తాము అధికారంలోకి రాగానే అన్నీ సరిచేస్తామని అంటున్నారు. అలాగే రౌడీయిజం చేసే వైసీపీ నేతల మక్కెలు విరగ్గొట్టి..వారికి తగిన శిక్ష పడేలా చేస్తామని అంటున్నారు. అంటే వైసీపీలో దౌర్జన్యాలు చేసే వారిపైనే పవన్ ఫైర్ అవుతున్నారు. కానీ జగన్ ఏమో..పవన్ రౌడీయిజం చేస్తున్నారని మాట్లాడుతున్నారు.

ఇక తాము ప్రజలకు మంచి పనిచేస్తున్నామని, దాన్ని బాబు, పవన్ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇక బాబు, పవన్ మాదిరిగా తమకు బూతులు మాట్లాడటం తెలియదని జగన్ చెప్పుకొచ్చారు. ఇక ఇక్కడ ఆయన ట్రోల్స్‌కు గురవుతున్నారు. అలాగే పవన్ మాదిరిగా నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేదని అన్నారు. అయితే బూతులు మాట్లాడటం మొదలుపెట్టింది ఎవరు..ఎవరు బూతులు మాట్లాడతారు అనేది ప్రజలకు తెలుసు.

వైసీపీ నేతలు బూతులు మాట్లాడటంలో ఆరితేరిపోయి ఉన్నారని, కానీ వారికి ఏమి రావని జగన్ చెప్పడం పెద్ద కామెడీ అని అంటున్నారు. ఇక పవన్ రాజకీయంగా చేసే విమర్శలకు సమాధానం చెప్పకుండా..వ్యక్తిగతంగా ఆయన పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారని, పవన్ పెళ్లిళ్ల గురించి జనం అందరికీ తెలుసని, కాబట్టి జగన్ ఇలాంటివి చేయడం వల్ల ఆయన ఇమేజ్ ఆయనే తగ్గించుకున్నట్లు అవుతుందని అంటున్నారు.