రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ రీసెంట్ మూవీస్ ఎంత కలెక్ట్ చేశాయో తెలిస్తే..

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్ ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్నాడు. ప్రభాస్ సినిమా విడుదలవుతుందంటే ఆయన ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమా కోసం అభిమానులు అంతగా ఎదురు చూస్తారు కాబట్టి. అయితే ప్రభాస్ ఈ మధ్యకాలంలో ప్రభాస్ నటించిన వరుస ఐదు సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్షన్ వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రభాస్ మొదటిసారి రాముడు పాత్రలో నటించిన ‘ఆదిపురుష్’ సినిమా ఇటీవల విడుదల అయింది. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదలైంది. ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో నటించగా, కృతి సనన్ సీత పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి వారం రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 75.27 కోట్లు వసూలు చేసింది.

ఇక రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘రాధే శ్యామ్’ సినిమాలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించారు. ఈ సినిమా విడుదలైన మొదటి వారం రోజుల్లో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 52.29 కోట్లు వసూలు చేసింది. అలానే సుజిత్ దర్శకత్వంలో వచ్చిన సాహో సినిమాలో ప్రభాస్ కి జంటగా శ్రద్ధా కపూర్ నటించింది. ఈ సినిమా విడుదలైన మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.74.92 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలో ప్రభాస్ హీరోగా, అనుష్క, తమన్న హీరోయిన్స్ గా నటించారు. బాహుబలి 1 విడుదల అయిన మోదటి వారం రోజులో రూ.117.92 కోట్లు వసూలు చెయ్యగా, పార్ట్ 2 విడుదల అయిన మొదటి వారంలో రూ.61.40 కోట్లు కలెక్ట్ చేసింది.