నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ అమ్మడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జోడీగా `పుష్ప 2` మూవీలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో రణ్బీర్ కపూర్ తో `యానిమల్` సినిమా చేస్తోంది. ఇవి రెండు సెట్స్ మీద ఉండగానే రష్మిక `రెయిన్ బో` అనే మూవీకి కమిట్ అయింది.
ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం. కెరీర్ లోనే తొలిసారి రష్మిక ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసింది. ఇందులో `శాకుంతలం` ఫేమ్ దేవ్ మోహన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. రష్మిక గురించి ఎన్ని వర్ణించినా తక్కువే అవుతుంది.
అందుకే ఈ కన్నడ నుంచి దిగుమతి అయిన ఈ సోయగం.. తక్కువ సమయంలో నేషనల్ క్రష్గా పేరు సంపాదించుకుంది. అయితే రష్మిక అందంగా ఉండటానికి ఓ కారణం ఉందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక తన బ్యూటీ సీక్రెట్ ను బయట పెట్టింది. తన అందం తగ్గకుండా ఉండేందుకు రష్మిక అమ్మ చెప్పిన ఈ చిట్కాను పాటిస్తుందట. గోరు వెచ్చని కొబ్బరి నూనెతో ముఖం, జుట్టు మర్దనా చేసుకుంటుంది. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా పాపకు అదే పనట. అందుకే తన స్కిన్ గ్లోయింగ్గా, షైనీగా మెరుస్తుంటుందని రష్మిక అంటోంది.