ఆ మత్తు పుట్టలో ఇంకెన్ని పాములో.. జబర్దస్త్ వారు కూడా..!

డ్రగ్స్.. ఈ మత్తు పుట్టలో కొన్నాళ్ల క్రితం నుంచి ఒక పెద్ద పాము మమ్మల్ని ఏం చేస్తారు లే అన్నట్టుగా తొంగిచూస్తూ లో లోపలే జరిపించాల్సిన కార్యాలన్నీ గుర్తు రట్టు కాకుండా జరిపించేస్తోంది. కానీ అతి తెలియవంతులైన పోలీసులు ఆ పామును పట్టేసుకున్నారు. ఇక ఆ పుట్టలో ఇంకెన్ని పాములు ఉన్నాయో అని ఆరా తీయగా ఒక్కొక్కటిగా బయటకి వస్తూ ఉండడంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అవుతుంది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా సినీ నిర్మాత కె.పి చౌదరి విచారణలో భాగంగా డ్రగ్స్ కు సంబంధించి విసిగిపోయే నిజాలు వెలుగులోకి వస్తూ ఉండడం గమనార్హం.

 

ఇకపోతే సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుమారులకు కేపీ చౌదరి డ్రగ్స్ అమ్మినట్లుగా తాజా దర్యాప్తులో తేలింది. చౌదరి ఇచ్చిన రిమాండ్ రిపోర్టుతో చాలీవుడ్ మొత్తం షేక్ అవుతోందని చెప్పవచ్చు. ఇందులో కేపీ చౌదరి మొత్తం 12 మంది డ్రగ్ పెడ్లర్స్, ఆరుగురు డ్రగ్స్ కన్జ్యూమర్స్ పేర్లను బయటపెట్టినట్లు సమాచారం. ఇందులో ప్రధానంగా రఘు తేజ పేరు కీలకంగా వినిపిస్తూ ఉండగా.. అతనితోపాటు శ్వేత, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేష్ , బెజవాడ భరత్, ఠాగూర్ ప్రసాద్, చింత రాకేష్ రోషన్, అతడి భార్య సాయి ప్రసన్న తదితరుల పేర్లు బయటికి వచ్చాయి.

సెలబ్రిటీల విషయానికి వస్తే.. అషు రెడ్డి తో పాటు జ్యోతి, సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రీతా పేర్లు కూడా బయటకు రావడం ఇప్పుడు మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక అక్కడితో ఆగకుండా జబర్దస్త్ నటీనటుల పేర్లు కూడా బయటకి వస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా జబర్దస్త్ నటుడు హైపర్ ఆది కాల్ లిస్ట్ మరియు అతడికి డబ్బులు పంపించినట్లుగా గుర్తించిన అధికారులు హైపర్ ఆది ఇక్కడ కీలకంగా వ్యవహరించినట్లు.. ముఖ్యంగా ప్రముఖుల కోసం డ్రగ్స్ సప్లై చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయంపై జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.