తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్ విజయశాంతి గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు.హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం వంటి భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలాంటి పాపులారిటీతోనే విజయశాంతి లేడీస్ సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించింది. ఈ రోజున విజయశాంతి 57వ బర్తడే సందర్భంగా విజయశాంతి గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అందులో చిరంజీవితో 20 ఏళ్లు మాట్లాడకపోవడానికి గల కారణం వైరల్ గా మారుతుంది వాటి గురించి తెలుసుకుందాం
విజయశాంతి గతంలో ఒక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ చిరంజీవి తనకు మధ్య ఒక ఇష్యూ జరిగిందని అందుకే తమ మధ్య మాటలు లేవని.. సినీ ఇండస్ట్రీ గురించి ప్రస్తుతం మారుతున్న ట్రెండ్ గురించి తెలియజేసినట్లు తెలుస్తోంది.. ఒకప్పుడు సినిమాలు 100, 200 ,ఒక సంవత్సరం వరకు ఆడేవి.. అలాంటి సినిమాలకు బహుమతులు చాలామంది సెలబ్రిటీస్ అందుకున్నారు.కానీ ఇప్పుడు ఒక సినిమా పది రోజులు ఆడాలంటే అది చాలా కష్టంగా మారుతోంది.అప్పటికి ఇప్పటికీ అభిమానులు అలాగే ఉన్నారు. అప్పట్లో వంద రోజులు ఫ్రాన్స్ అన్ని చాలా గ్రాండ్గా చేసే వాళ్ళ కానీ ఇప్పుడు మాత్రం రిలీజ్ ముందు ఈవెంట్ చాలా ఘనంగా ప్లాన్ చేస్తున్నారని తెలిపింది.
వాస్తవానికి చిరంజీవికి నాకు 20 ఏళ్లు పైగా మాటల్లేవు.. సరిలేరు నీకెవరు సినిమా ఫంక్షన్ లో మాత్రమే మాట్లాడామని తెలిపింది. గతంలో తాను చేస్తున్న ఒక ఉద్యమానికి ఎవరు కూడా సపోర్టు ఇవ్వకపోవడంతో పాటు.. సినీ సభ్యులంతా ఐక్యమత్యంగా ఉండాలని అందుకోసం అందర్నీ పిలిచిన రాలేదని తెలిపింది విజయ్ శాంతి.. అలాగె రాజకీయాలలో కూడా పలు రకాల విషయాల పైన పలు కొన్ని విభేదాలు రావడంతో మాట్లాడుకోలేదని తెలిపింది విజయశాంతి. కానీ ఈ ఈమధ్య అలాంటిది ఏమీ లేదంటూ తెలియజేసింది విజయశాంతి.