`మహానటి` తర్వాత ఆ స్థాయిలో మరో విజయాన్ని అందుకోలేకపోయిన అందాల భామ కీర్తి సురేష్.. సర్కారు వారి పాటతో ఓ మోస్టరు హిట్ అందుకుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ దసరా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ మూవీతో కీర్తి సరేష్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది.
ఇక ఆమె దశ తిరిగినట్లే అని అంతా అనుకున్నారు. కానీ, దసరా విడుదల తర్వాత కీర్తి సురేష్ నుంచి మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రాలేదు. కొత్త సినిమాకు సైన్ చేసిందన్న వార్తలు కూడా రాలేదు. దాంతో కీర్తి సురేష్ కు తెలుగులో ఆఫర్లు రావడం రావడం లేదు.. ఇక ఇక్కడ ఆమె కెరీర్ ముగిసినట్లే అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు.
అయితే ఎట్టకేలకు అందరి అనుమానాలకు కీర్తి సురేష్ తెర దించబోతోంది. త్వరలోనే గుడ్న్యూస్ చెప్పబోతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఆమె ఒక కొత్త ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. అక్కినేని నాగచైతన్యతో జోడీ కట్టబోతోంది. నాగచైతన్య, చందూ మొండేటి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై ఈ మూవీ నిర్మితం కానుంది. అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కీర్తి సురేష్ ను సంప్రదించగా.. ఆమె వెంటనే ఓకే చెప్పిందట. అలాగే మరొక హీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్ ను తీసుకున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని అంటున్నారు. ఎట్టకేలకు కీర్తి సురేష్ ఓ కొత్త ప్రాజెక్ట్ కు సైన్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.