చిల్ అవుతున్న డైరెక్టర్..ఫ్యామిలీతో కలిసి వెకేషన్

బహుబలి, RRR సినిమాలతో తెలుగు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. RRR సినిమాలో నాటు నాటు పాటకి ఆస్కార్ కూడా వచ్చిన విషయం అందరికి తెలిసిందే. RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు పొందడమే కాకుండా ఎంతో మంది హాలీవుడ్ దర్శకుల చేత ప్రశంసలు అందుకున్నారు. బాహుబలి, RRR సినిమాల తరువాత అందరి చూపు జక్కన్న మీదే పడింది. తరువాత ఏ సినిమా చేయనున్నారు, ఎలాంటి రికార్డులు సృష్టించబోతున్నారు అంటూ అందరు చర్చించుకుంటున్నారు.

అయితే రాజమౌళి మాత్రం బాహుబలి, RRR సినిమాల తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లారు. ప్రస్తుతం రాజమౌళి భార్య పిల్లలతో కలిసి తమిళనాడులోని తూత్తుకుడి వెళ్లారు. అక్కడ రిసార్ట్ లో మొక్కలు నాటుతున్నాడు. ఈ విధంగా రాజమౌళి వెకేషన్ లకి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

RRR సినిమా తరువాత మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్టు ఇదివరకే ప్రకటించారు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. సినిమా మొదలయ్యాక రాజమౌళి బిజీ అవుతారు కాబట్టి సినిమా ప్రారంభానికి ముందే ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లారు. రాజమౌళి-మహేష్ బాబు సినిమాపై ఎలాంటి అప్డేట్ లేకపోయినా సినిమాపై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉంటుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. RRR తరువాత ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పేరు మారుమోగిపోయింది. ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ లు కొట్టిన విషయం అందరికి తెలిసిందే. రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ మాత్రం మహాభారతం అని అందరికి తెలిసిందే. ఈ సినిమా రాజమౌళి ఎప్పుడు తీస్తారని అందరు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే రాజమౌళి ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.