`వాల్తేరు వీరయ్య` వంటి బ్లాక్ బస్టర్ మూవీతో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం `భోళా శంకర్` మూవీతో బిజీగా ఉన్నాడు. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంటే.. కీర్తి సురేష్ చిరంజీవికి సోదరి పాత్రను పోషిస్తోంది. సుశాంత్, మురళీ శర్మ, రావు రమేష్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుంటే.. మహతి స్వర సాగర్ స్వరాలు అందిస్తున్నాడు. ఆగస్టు 11న ఈ చిత్రం విడుదల కాబోతోంది. రీసెంట్ గా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ కూడా బయటకు వచ్చింది. అయితే తాజాగా మెగాస్టార్ ఫ్యాన్స్ ను కలవర పెట్టే బ్యాక్ న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
అదేంటంటే.. భోళా శంకర్ విడుదల తేదీ వాయిదా పడబోతోందట. ఈ సినిమా వర్క్ బ్యాలెన్స్ ఉందట. సెకండాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రెండు సాంగ్స్ షూట్ ఇంకా చిత్రీకరించాల్సి ఉందట. పైగా జూలై 28న పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి చేసిన మెగా మల్టీస్టారర్ `బ్రో` విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే `భోళా శంకర్`ను విడుదలను వాయిదా వేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్.