`కేజీఎఫ్` మూవీతో దేశవ్యాప్తంగా తన సత్తా ఏంటో చాటిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం ప్రభాస్ తో `సలార్` మూవీ చేస్తున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఆదివారం నాడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు.
దాంతో సలార్ సెట్స్ లో ప్రశాంత్ నీల్ బర్త్ డేను ప్రభాస్ స్వయంగా సెలబ్రేట్ చేశారు. కేక్ కట్ చేయించి విషెస్ తెలిపారు. మరోవైపు ప్రశాంత్ నీల్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊహించని గిఫ్ట్ తో సర్ప్రైజ్ చేశాడు. వీరిద్దరి కాంబోలో ఓ మూవీ సెట్ అయిన సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 31` ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లోనే తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై అపీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది.
ఇక ఈ క్రమంలోనే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. అయితే నిన్న ప్రశాంత్ నీల్ బర్త్డే కావడంతో.. ఎన్టీఆర్ తన ఇంట్లో ప్రత్యేకంగా చేయించిన నాటు కోడి పులుసును పంపించి బర్త్ డే ట్రీట్ ఇచ్చాడు. ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ వైఫ్ లిఖిత రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తూ.. `థాంక్యూ అన్నయ్య` అంటూ ఎన్టీఆర్ ను ఉద్దేశిస్తూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ మారింది.