సుడిగాలి సుధీర్‌కి అంత సీన్ లేదు అంటూ హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్..

బుల్లితెర కమెడియన్,యాంకర్ సుడిగాలి సుధీర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ యాక్టర్ జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమై ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నాడు. బుల్లితెరపై కామెడీ షోలో కంటెస్టెంట్ గా చేస్తూనే, మరికొన్ని షోస్ కి హోస్ట్ గా కనిపించాడు. ఇలా బుల్లితెరపై ఉంటూనే ఒక హీరోకి ఉండాల్సినంత క్రేజ్ ని సంపాదించుకున్నాడు. జబర్దస్త్ లో ఒక కమెడియన్ గా మొదలైన సుధీర్ కెరీర్ ప్రస్తుతం హీరోగా సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగాడు.

ఇప్పటికే సుడిగాలి సుధీర్‌ మూడు సినిమాలను పూర్తి చేసుకొని, నాలుగవ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే సినిమా ఆఫర్స్ రావటంతో, తన కెరీర్ మొదలు పెట్టిన జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేసాడు సుధీర్. ఇలా మల్లెమాల ప్రొడక్షన్ నుండి వెళ్లిపోయినప్పటికీ తరచూ సుధీర్‌ పేరు వినిపిస్తూనే ఉంటుంది. మల్లెమాలలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోస్ లో ఎవరో ఒకరు సుధీర్‌ ప్రస్తావన తెస్తూనే ఉంటారు. అయితే సుధీర్ వెళ్లిపోయిన తర్వాత మాత్రం అతని స్థానాన్ని హైపర్ ఆది ఆక్రమించాడు. ప్రస్తుతం మల్లెమాల టీంలో హైపర్ ఆది నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు.

ఇక రీసెంట్ గా హైపర్ ఆది ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఇంటర్వ్యూలో భాగంగా హైపర్ ఆదికి ఒక ప్రశ్న ఎదురైంది. అదేంటంటే ‘ సుధీర్ ఒకవేళ తిరిగి మల్లెమాలలోకి రీ ఎంట్రీ ఇస్తే అతని ప్లేస్ ని అతనికి ఇచ్చేస్తారా?’ అని యాంకర్ ప్రశ్నిస్తారు. దానికి ఆది సమాధానం చెప్తూ ‘ కేవలం సుధీర్ అనే ఒక వ్యక్తి వల్లనే మల్లెమాల కు పేరు రాలేదు. అందరం కలిసి సుధీర్ అన్న చుట్టూ ఉండి అతనికి పేరు వచ్చేలా చేసాం. మేము ఆయన మీద వేసే పంచుల వలనే సుధీర్‌ అన్న అంతగా ఫేమస్ అయ్యాడు. మేము లేకపోతే ఆయన అంత ఫేమస్ అయ్యేవాడు కాదు’ అంటూ సమాధానం ఇచ్చాడు ఆది. దాంతో సుధీర్‌ ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయ్యి ఆది పై ఫైర్ అవుతున్నారు.