మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. సొట్టబుగ్గుల సుందరి లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ఏడడుగులు వేయబోతున్నాడు. `మిస్టర్` మూవీతో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారడంతో.. ఇరువురు వివాహం చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. ఇటీవలె నాగబాబు నివాసంలో వీరి ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది.
ఈ ఏడాది చివర్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటటీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే వీరిద్దరి పెళ్లి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కి పెద్ద తలనొప్పిగా మారింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ అయనప్పటి నుంచి సాయి ధరమ్ తేజ్ పెళ్లి మ్యాటర్ ట్రెండింగ్ టాపిక్ గా మారింది. సాయి ధరమ్ తేజ్ కూడా ఓ హీరోయిన్ తో పెళ్లికి రెడీ అయ్యాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
గతంలో పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాల్లో తనకు జోడీగా నటించిన రెజీనాతో సాయి ధరమ్ తేజ్ ప్రేమలో పడ్డాడని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్తలను సాయి ధరమ్ తేజ్, రెజీనా అస్సలు పట్టించుకోలేదు. ఎవరి లైఫ్ లో వారు బిజీ అయిపోయారు. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతుండటంతో.. సాయి ధరమ్ తేజ్ పెళ్లి మ్యాటర్ కూడా ట్రెండ్ అవుతోంది. రెజీనాతోనే తేజ్ ఇంకా రిలేషన్ లోనే ఉన్నాడని.. ఆమెతోనే ఇప్పుడు ఏడడుగులు వెయ్యడానికి రెడీ అవుతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఇదెక్కడి గోల రా బాబు అంటూ సాయి ధరమ్ తేజ్ తల పట్టుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.