సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి గత కొంత కాలం నుంచి సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. అనుష్క వెండితెరపై కనిపించి కూడా చాలా ఏళ్లు అవుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒకే ఒక్క ప్రాజెక్ట్ ఉంది. అదే `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`. పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, అనుష్క జంటగా నటిస్తున్నారు.
దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇంతకు చేతి నిండా ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేసిన అనుష్క.. ఇప్పుడు ఇలా సినిమాలు చేయడం తగ్గించడం వెనక బలమైన కారణమే ఉందట. కొందరు డైరెక్టర్లు పెట్టిన టార్చర్ కారణంగా అనుష్క సినిమాలపై ఆసక్తి తగ్గిపోయిందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
బాహుబలి వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం భాగమతి, నిశ్శబ్దం వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో అనుష్క మెరిసింది. దాంతో లేడీ ఓరియేంటెడ్ సినిమాల పై అనుష్కకు ఇంట్రెస్ట్ ఉందేమో అన్న సందేహంతో ఓ సెక్షన్ దర్శకులు ఆ తరహాతో కథలనే అనుష్కకు ఎక్కువగా వినిపించి బాగా ఇబ్బంది పెట్టారట. కాస్త పేరున్న దర్శకులు కూడా అనుష్కకు అలాంటి కథలే చెప్పడంతో.. ఆమె బాగా విసిగిపోయిందట. ఇక మొదట్లో ఓపిక గానే కథలు విన్నా.. ఆ తర్వాత వారి టార్చర్ భరించిలేక తప్పించుకోవడం మొదలు పెట్టిందట. ఇక ఇప్పుడు అపాయింట్మెంట్స్ కూడా మానేసిందట. మరోవైపు ఇంట్లో వారు పెళ్లిపై ఎప్పటి నుంచో ఒత్తిడి తెస్తుండటంతో.. సినిమాలు తగ్గించి తల్లిదండ్రులు కోరిక మేరకు ఓ ఇంటి దాన్ని కావాలని భావిస్తుందట.