యాంకర్ సౌమ్యరావు షాకింగ్ నిర్ణయం.. జబర్దస్త్ షోకి త్వరలోనే గుడ్‌బై..?

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా కమెడియన్లు మాత్రమే కాకుండా యాంకర్లు కూడా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా అనసూయ ఈ షో ద్వారానే తన క్రేజ్‌ను పెంచుకొని చివరికి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు తగ్గించుకుంది. ఇక రష్మీ కూడా జబర్దస్త్ షోతో బాగానే బాగుపడింది. అయితే సినిమాల్లో వరుసగా అవకాశాలు వస్తుండటంతో అనసూయ జబర్దస్త్ ప్రోగ్రామ్‌ను వదిలేసింది. కిలకిలా నవ్వుతూ, గ్లామర్ షో చేస్తూ షో మొత్తానికి ఉత్సాహాన్ని తెచ్చే అనసూయ మానేయడంతో జబర్దస్త్ యాజమాన్యం షాక్ తిన్నది.

తర్వాత చేసేది లేక ఆ స్థానాన్ని సీరియల్ యాక్ట్రెస్ సౌమ్య రావుతో భర్తీ చేసింది. ప్రేక్షకులు మొదట సౌమ్యకి అలవాటు పడకపోయినా ఆ తర్వాత ఆమెను కూడా యాక్సెప్ట్ చేయడం ప్రారంభించారు. ఈ ముద్దుగుమ్మ కన్నడ బుల్లితెర ఇండస్ట్రీ నుంచి తెలుగు స్మాల్ స్క్రీన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈటీవీలో ప్రసారమైన శ్రీమంతుడు సీరియల్ తో పాపులర్ అయింది. జబర్దస్త్ ద్వారా అనసూయ, రష్మిక అంత కాకపోయినా చెప్పుకోదగిన రేంజ్‌లో స్టార్డమ్‌ సంపాదించింది.

ఆ క్రేజ్‌తోనే ఈ అందాల కన్నడ కుట్టి ఒక సినిమాలో మంచి అవకాశాన్ని దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సౌమ్య జబర్దస్త్ ఒక్కో ఎపిసోడ్‌కి రూ.60,000 తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే నెల మొత్తం మీద వచ్చే ఈ డబ్బులు ఆమెకు చాలడం లేదంట. పైగా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయంట. అందుకే టైమంతా కేవలం జబర్దస్త్‌కి వెచ్చించడం కంటే సినిమాల్లో అనసూయ లాగా సెటిల్ అయిపోవడం బెటర్ అని ఆలోచిస్తోందట. అంతేకాదు, లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం సౌమ్య రావు జబర్దస్త్ గుడ్ బై చెప్పడానికి కూడా రెడీ అయిందట. మరి ఇందులో నిజం ఎంత ఉందో త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.