సినిమా కోసం ప్రాణాల‌నే ప‌ణంగా పెట్టిన ర‌కుల్‌.. ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

సుదీర్ఘకాలం నుంచి సినీ ఇండ‌స్ట్రీలో స‌త్తా చాటుతున్న అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో స్టార్ హోదాను అందుకోవాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తోంది. టాలీవుడ్ లో సంపాదించుకున్న క్రేజ్ తో బాలీవుడ్ కు మకాం మార్చింది. తెలుగులో వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నా స‌రే.. వాటిని ప‌క్క‌న పెట్టి నార్త్ లో వ‌రుస సినిమాలు చేస్తోంది.

గ‌త ఏడాది ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఐదు చిత్రాల‌తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. కానీ, ర‌కుల్ కు నిరాశే ఎదురైంది. అయినాస‌రే వెన‌క‌డుగు వేయ‌కుండా బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ ల‌ను లైన్ లో పెడుతోంది. ప్ర‌స్తుతం ర‌కుల్ చేస్తున్న సినిమాల్లో `ఐ లవ్ యూ` ఒక‌టి. పావైల్ గులాటీ ఇందులో హీరోగా న‌టిస్తుంటే.. నిఖిల్ మహాజన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా త్వ‌ర‌లోనే ఓటీటీలో విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమా కోసం ర‌కుల్ త‌న ప్రాణాల‌నే ప‌ణంగా పెట్టింది. అవును, ఈ సినిమాలో నీటి అడుగున కొన్ని సీన్స్ ఉంటాయట. అయితే ఈ సీన్స్‌ కోసం రకుల్ ఎంత‌గానో కష్టపడిందట. ఒక స‌న్నివేశంలో ఏకంగా రెండు నిమిషాల 30 సెకన్ల పాటు నీటి అడుగున గాలి పీల్చుకోకుండా ఉందట రకుల్. అంతేకాదు ఈ సీన్ ను చిత్రీక‌రించే స‌మ‌యంలో దాదాపు 14 గంట‌లు ర‌కుల్ నీటిలో ఉండాల్సి వ‌చ్చింది. ఇందుకోసం రకుల్ చాలా ప్రాక్టీస్ చేసిందట. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట‌ వైరల్ గా మారాయి. దీంతో సినిమాల ప‌ట్ల ర‌కుల్ కు ఉన్న డెడికేష‌న్ కు నెటిజ‌న్లు ఫిదా అవుతూ.. ఆమె ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.