నాకు ఆ హీరోలతో పెళ్లి అయిపోయింది, ఇంకా పెళ్ళెందుకు: అనుష్క

టాలీవుడ్ నటి అనుష్క శెట్టి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ప్రస్తుత జెనరేషన్లో వున్న చెప్పుకోదగ్గ నటీమణులలో హీరోయిన్ అనుష్క ఒకరు. ఆమె ప్రత్యేకత ఏమంటే, ముఖ్యంగా తన హైట్, పర్సనాలిటీ ఇక్కడ ఇంకే నాటికి కూడా ఉండదు. దాంతో ఇక్కడ కుర్రకారు అనుష్క శెట్టి అంటే పడి చస్తారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్’ సినిమాతో ఈ అమ్మడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి, మెప్పించింది. 41 ఏళ్ల వయస్సు గల అనుష్కపై సినీ కెరియర్ కన్నా పర్సనల్ కేరీర్ మీదనే ఎన్నో కాంట్రవర్సీలు రావడం కొసమెరుపు.

ఈ క్రమంలో రోజుకు ఒక్కసారైనా సోషల్ మీడియాలో ప్రభాస్ అనుష్కల ప్రేమ పెళ్లి వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కేవలం ప్రభాస్ తోనే కాకుండా గోపీచంద్, నాగార్జున వంటి వాళ్లతో కూడా గతంలో ఆమె ఎఫైర్ నేర్పినట్టు వార్తలు వినిపించాయి. లోగుట్టు పెరుమాళ్ళకెరుకగాని ఈ మీడియా సంస్థలకు సినిమావాళ్ళంటే చాలు కవ్వింపు చర్యలకు దిగుతూ వుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఎన్నో వార్తలు నెట్టింట వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రావడం లేదు గాని వీరిద్దరూ సినిమాలు చేయడంలో తనమునకలై వున్నారు.

వరుస సినిమాలతో ప్రభాస్ మంచి జోరు మీదుంటే అనుష్క మాత్రం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ పోతోంది. ప్రస్తుతం ఆమె నవీన్ పొలిశెట్టి హీరోగా వస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క శెట్టి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది. అనుష్క శెట్టి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో నాపై ఎన్నో ట్రోల్స్ వస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా నాకు 5 సార్లు పెళ్లి జరిగింది. మరి ఆ ఐదుగురు ఎవరు అని అనుష్క ని యాంకర్ అడగగా.. ప్రభాస్, నాగార్జున, సుమంత్, ప్రకాష్ కోవెలమూడి, గోపీచంద్ అంటూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం అనుష్క మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.