`గుంటూరు కారం` గ్లింప్స్‌లో మ‌హేష్‌తో పాటు మ‌రో స్టార్ హీరో ఉన్నాడు.. గ‌మ‌నించారా?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ మూవీ `గుంటూరు కారం`. ఇందులో పూజా హెగ్డే, శ్రీ‌లీల హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నాడు.

ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. అయితే రీసెంట్ గా ఈ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్ ను బ‌య‌ట‌కు వ‌దిలిన సంగ‌తి తెలిసిందే. ఈ గ్లింప్స్ వీడియోలో మ‌హేష్ మాస్ లుక్ ఆక‌ట్టుకుంది. అలాగే నోటిలో నుంచి బీడీ తీస్తూ.. `ఏందట్టా జూస్తున్నావ్.. బీడీ త్రీడీలో కనిపిస్తోందా..?` అనే మాస్ డైలాగ్ తో మహేష్ అదరగొట్టాడు.

అయితే ఎంత మంది గ‌మ‌నించారో కానీ.. ఈ గ్లింప్స్ వీడియోలో మ‌హేష్ బాబు పాటు మ‌రో స్టార్ హీరో క‌మ్ విల‌న్ గా కూడా ఉన్నాడు. ఇంత‌కీ అత‌నెవ‌రో కాదు జ‌గ‌ప‌తిబాబు. మహేష్ బాబు తొడ కొట్టినప్పుడు కార్ గాల్లోకి లేచే సన్నివేశం గుర్తు ఉండే ఉంటుంది. ఆ టైమ్ లో మహేష్ కి కుడివైపు జనాలతో పాటుగా చెవులు గట్టిగా మూసుకొని జగపతి బాబు నిలబడి ఉంటాడు. డౌట్ ఉంటే పైన ఫోటో ఉంది.. ఓ లుక్కేయండి. ఇక ఈ చిత్రంలో జ‌గ‌ప‌తి బాబు విల‌న్ గా న‌టిస్తున్నాడ‌ని త్రివ‌క్రిమ్ ఫ‌స్ట్ గ్లింప్స్ తోనే హింట్ ఇచ్చేశాడు.