బ్రో చిత్రంలో ఐటెం సాంగ్ కోసం స్టార్ హీరోయిన్..!!

టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ నటిస్తున్న తాజా చిత్రం బ్రో. ఈ చిత్రాన్ని నటుడు డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం క్లైమాక్స్ గా చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం రెండు పాటలు మాత్రమే పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి ఐటెం సాంగ్ కాగా మరొకటి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఐటెం సాంగ్ కోసం ఒక స్టార్ హీరోయిన్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇద్దరి హీరోలు కావడంతో వాళ్ల రేంజ్కి తగ్గకుండా హీరోయిన్ కోసం వెతుకుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ పాటకు రకుల్ ప్రీతిసింగ్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఒకేసారి ఇద్దరితో డాన్స్ చేసే అవకాశం రావడంతో ఈ అమ్మడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రకుల్ ప్రీతిసింగ్ బ్రో సినిమాల అవకాశం రావడంతో మిస్ చేసుకోకుండా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం రోజున ఈ పాట చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. అయితే రకుల్ ప్రీతిసింగ్ కి డేట్ లో అడ్జస్ట్ కాలేకపోవడంతో కొత్త డేట్లను ప్లాన్ చేసుకోమని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరి దీంతో రకుల్ ప్రీతిసింగ్ డేట్ల విషయంలో డైలమాలు పడినట్లు తెలుస్తోంది దీంతో చిత్ర బృందం ఆమెను ఉంచాలా లేకపోతే కొత్త హీరోయిన్ ని తీసుకురావాలనే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అభిమానులు మాత్రం రకుల్ ప్రీతిసింగ్ అయితే బాగుంటుందని భావిస్తున్నారు. ఒకవేళ రకుల్ ప్రీతిసింగ్ సెట్టు కాకపోతే మరొక నటి ఊర్వశి రౌతేలా ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై ఎవరు అధికారికంగా క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.