రామాయణం ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సీతారాములుగా కృతి సనన్, ప్రభాస్ నటించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్రను పోషించారు. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ప్రభాస్ ని రాముడిగా వెండితెరపై చూసేందుకు ఇండియన్ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే థియేటర్స్ వద్ద ప్రభాస్ అభిమానులు సందడి మొదలైంది. మరోవైపు కనీవినీ ఎరుగని రీతిలో బుక్కింగ్స్ జరుగుతున్నాయి. ఇకపోతే వరల్డ్ వైడ్ గా రూ. 240 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఆదిపురుష్.. రేపు రూ. 242 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది.
అయితే తొలి రోజు ఈ సినిమా టార్గెట్ ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు. ఆదిపురుష్ చిత్రం ఇండియా వ్యాప్తంగా మొదటి రోజు రూ. 85 కోట్ల రేంజ్ లో షేర్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. మరికొందరు ట్రేడ్ విశ్లేషకులు వరల్డ్ వైడ్ గా ఆదిపురుష్ చిత్రం తొలి రోజు 100 కోట్లకి పైగా వసూళ్లు రాబడుతుందని ధీమాగా చెబుతున్నారు. ఇదే కనుక జరిగితే ప్రభాస్ చరిత్ర తిరగరాడం.. ఆర్ఆర్ఆర్, బాహుబలి, పఠాన్ లాంటి చిత్రాల బాక్సాఫీస్ రికార్డులు గల్లంతు కావడం ఖాయమవుతుంది.