రామాయణం ఆధారణంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన అద్భుతమైన మహాకావ్యం `ఆదిపురుష్`. ఇందులో సీతారాములుగా కృతి సనన్, ప్రభాస్ నటించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, సన్నీసింగ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న అట్టహాసంగా విడుదల కాబోతోంది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమదైన ప్రమోషన్స్ లో చిత్ర టీమ్ మరింత హైప్ పెంచేస్తోంది. అలాగే పేద పిల్లల కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూ. 10 వేల టికెట్స్ చొప్పున బుక్ చేశారు. అలాగే ఆదిపురుష్ టీమ్.. ప్రతీ సినిమా హాల్ లో హనుమంతుని కోసం ఓ సీట్ ను బుక్ చేశారు.
మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ టార్గెట్ కూడా లాక్ అయిపోయింది. ఏపీతో పాటు తెలంగాణలో ఈ చిత్రానికి ఏకంగా రూ. 120 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో ఇక్కడ అదిపురుష్ హిట్ కొట్టాలంటే రూ. 121 కోట్ల షేర్ ను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మొదటి రోజే ఇందులో సగం టార్గెట్ ను ఆదిపురుష్ రీచ్ అవుతుందని చిత్ర టీమ్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇక ఏరియాల వారీగా ఆదిపురుస్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను చూస్తే..
నైజాంలో – 50 కోట్లు
సీడెడ్- 17.60 కోట్లు
ఉత్తరాంధ్ర – 14.50 కోట్లు
తూర్పు గోదావరి – 8.80 కోట్లు
పశ్చిమ గోదావరి – 7.20 కోట్లు
గుంటూరు – 8.60 కోట్లు
కృష్ణా జిల్లా – 8.50 కోట్లు
నెల్లూరు – 4.80 కోట్లు
———————————————-
ఏపీ+తెలంగాణ టోటల్ బిజినెస్= 120 కోట్లు
———————————————–