ఆది పురుష్ : ప్రభాస్ ఫ్యాన్స్ కి మండించిన థియేటర్ యాజమాన్యం.. అద్దాలు పగలగొట్టిన అభిమానులు.. స్ట్రైట్ వార్నింగ్..!!

ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ..వెబ్ మీడియాలో .. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి మెయిన్ రీజన్ ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన ఆది పురుష్ సినిమా కొద్ది గంటల ముందే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ నమోదు చేసుకోవడమే . మనకు తెలిసిందే ఆదిపురుష్ సినిమా ట్రైలర్ లాంచ్ అవ్వగానే అందరూ జనాలు ఈ సినిమా దొబ్బేస్తుందని.. ఈ సినిమాలో అంత సీన్ లేదని .. ప్రభాస్ రాముడు గా సెట్ అవ్వడని ..నానావిధాలుగా ట్రోల్ చేశారు .

వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ చాలా దారుణంగా ఉన్నాయని .. చిన్నపిల్లలు ఆడుకునే వీడియో గేమ్ లా.. డిజైన్ చేశాడు అంటూ ఆది పురుష్ డైరెక్టర్ ఓం రావత్ ని ఏకీపారేశారు . సీన్ కట్ చేస్తే సినిమా రిలీజ్ అవ్వగానే ఆ నెగటివ్ కామెంట్స్ మొత్తం పాజిటివ్గా మారిపోయాయి. ఒక్క వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ తప్పిస్తే సినిమాలో వేలు పెట్టడానికి అసలు ఆస్కారమే లేదు అంటూ సినీ విశ్లేషకులు సైతం చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో ఆది పురుష్.. టాక్ వైరల్ గా మారింది .

అయితే ఆది పురుష్ ప్రదర్శితమవుతున్న కొన్ని థియేటర్లలో అడపాదడపా గొడవలు జరుగుతున్నాయి . కాగా ఈ క్రమంలోనే తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో రామచంద్రపురం పరిధిలో ఉన్న జ్యోతి థియేటర్లో ఆది పురుష్ సినిమాను ఆలస్యంగా ప్రదర్శించారని ఫ్యాన్స్ మండిపడిపోయారు . అంతేకాదు ఎంతో ఓపికగా ..సహనంగా.. వెయిట్ చేసిన ఫ్యాన్స్.. సినిమా లేటుగా ప్రదర్శితమైన హాల్లోకి వెళ్ళాక సౌండ్ సిస్టం బాగా లేక డైలాగులు సరిగా వినపడక క్లీన్ నెస్ లేక చిరెత్తి పోయారు. ఈ క్రమంలోనే ఓపిక నశించడంతో థియేటర్ బయటకు వచ్చి అక్కడ ఉన్న అద్దాలను కుర్చీల ను డోర్స్ ను పగలగొట్టారు . దీంతో యాజమాన్యం వెంటనే సినిమా ప్రదర్శనను నిలిపివేసి ప్రేక్షకులను బయటికి పంపించేశారు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!