నిధి అగ‌ర్వాల్ ను దారుణంగా మోసం చేసిన స్టార్ హీరోలు.. డిప్రెష‌న్ లో ఇస్మార్ట్ పోరి!?

అందాల భామ నిధి అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేకమైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇస్మార్ట్ శంక‌ర్‌` మూవీతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ‌.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌రుస అవకాశాలు అందుకుంది. కోలీవుడ్ లో ఈశ్వరన్, భూమి, కలగ తలైవన్ చిత్రాల‌తో అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. కానీ, అవేవి అక్క‌డ ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. దాంతో కోలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాతలు నిధిని ప‌క్క‌న పెట్టేశారు.

ఇక టాలీవుడ్ విష‌యానికి వ‌స్తే.. ఏకంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు జోడీగా `హరి హర వీర మల్లు` వంటి భారీ ప్రాజెక్ట్ లో అవ‌కాశాన్ని అందుకుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ను 2020లోనే అనౌన్స్ చేశారు. కానీ, ఇంత వ‌ర‌కు షూటింగ్ పూర్తి కాలేదు. అస‌లు ఈ మూవీ విడుద‌ల అవుతుందో.. లేదో.. కూడా తెలియ‌డం లేదు.

హరి హర వీర మల్లుతో త‌న జాత‌క‌మే మారిపోతుంద‌ని భావించిన నిధికి నిరాశే ఎదురైంది. సరే పవన్ మూవీ ప్రారంభం కాకపోతే ఏంటి? ప్రభాస్ మూవీ ఉంది కదా అనుకుంది. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెర‌కెక్క‌బోతున్న‌ హర్రర్ కామెడీ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ షూటింగ్ కూడా కొంత పూర్తైన‌ట్లు స‌మాచారం. కానీ, ఈ మూవీ సైతం ఇప్ప‌ట్లో విడుద‌ల‌కు నోచుకునే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. ప్ర‌భాస్ ఫోక‌స్ మొత్తం స‌లార్‌, ప్రాజెక్ట్-కె మీదే ఉన్నాయి. ఇవి రిలీజ్ అయిన త‌ర్వాతే మారుతి మూవీ ఉంటుంది. ఇందుకు ఎంత కాలం పట్టొచ్చో ఎవరూ చెప్పలేరు. మొత్తానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌భాస్ ను న‌మ్మి దారుణంగా మోస‌పోయిన నిధి.. డిప్రెష‌న్ లో కూరుకుపోయింద‌ట‌. ఇక త‌న కెరీర్ క్లోజ్ అయిన‌ట్లే అని తెగ బాధ‌ప‌డుతుంద‌ని ఇన్‌సైడ్ టాక్ న‌డుస్తోంది.