ఆర్జీవీ పై ఫైర్ అవుతున్న శివాజీ..ఇప్పుడిదే హాట్ టాపిక్

రామ్ గోపాల్ వర్మ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన ఒక హాట్ టాపిక్ అవుతుందని అందరికి తెలిసిందే. అలానే ప్రముఖ నటుడు శివాజీ విషయంలోనూ అంతే. అయితే ఈసారి నటుడు శివాజీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఫైర్ అయ్యాడు. ఇప్పుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగింది అనేది ఇప్పుడు చూసేద్దాం.

తాజాగా రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నట్టు కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమా గురించి శివాజీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. గత ఎన్నికలలో కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాలను రాంగోపాల్ వర్మ తీసిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలు విడుదలకు ముందు రామ్ గోపాల్ వర్మ పెట్టిన ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు నెట్టింట హల్ చల్ చేసేవి. అప్పుడు కూడా నటుడు శివాజీ ఈ సినిమాలపై స్పందించారు.

నటుడు శివాజీ మాట్లాడుతూ కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాలు తీసి ఏం పీకాడు? కమ్మోళ్లను ఏమైనా పీక గలిగాడా ? అంటూ ఘాటుగా కామెంట్లు చేశారు. వర్మ ఒక తెలివైన బిజినెస్ మాన్ ఎందుకంటే వర్మ ప్రతిరోజు చంద్రబాబు నాయుడుని తిడితే వాళ్లకి జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ అయిపోతారు. వ్యూహం సినిమాను మడిచి బ్యాగ్ లో పెట్టుకో అంటూ శివాజీ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి మీకు డబ్బులను ఇస్తున్నాడు కాబట్టే మీరు ఆ సినిమా తీస్తున్నారు అంటూ విమర్శించారు. రేపొద్దున చంద్రబాబు నాయుడు మీకు డబ్బులు ఇస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి పైన వర్మ సినిమా తప్పకుండా తీస్తాడు అన్నారు. హైదరాబాదులో కూర్చుని పోరంబోకులా మాట్లాడితే ఎవడు కూడా పట్టించుకోడు. జగన్ డబ్బులు ఇస్తున్నాడు కాబట్టే అతడి గురించి రాస్తూ.. కమ్మోళ్ళను , చంద్రబాబును తిడుతున్నావు.. ఏం పీకుతావు నాయనా నువ్వు.. నువ్వు పీకేది ఏమీ లేదు కొంచెం ఓపిక పట్టు అంతా క్లారిటీ వస్తుంది అంటూ శివాజీ ఒక ఇంటర్వ్యూలో ఘాటుగా మాట్లాడారు.