అందుకే ఎన్టీఆర్ తన తాత ఫంక్షన్ కి హాజరు కాలేదు.. ఆర్జీవి హాట్ కామెంట్స్..!!

నిన్నటి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి.. విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇవన్నీ తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, డైరెక్టర్ ఆర్జీవి, పోసాని కృష్ణమురళి, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు పోసాని చంద్రబాబు పైన పలు వాక్యాలు చేశారు. ఎన్టీఆర్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు ..ఆయన నెంబర్ వన్ హీరో చంద్రబాబు చేతుల్లో చనిపోయాడని కూడా తెలుసు.. చంద్రబాబు చేసే పనిలో వల్లే ఎన్టీఆర్ కు మూడుసార్లు గుండెపోటు వచ్చిందని ఆ సమయం లో చిన్నపిల్లాడిలా అతన్ని చూసుకుంది లక్ష్మీపార్వతి గారే కానీ ఎవరు అతని పట్టించుకోలేదంటూ తెలిపారు పోసాని.

RGV urges Jr NTR to take over TDP and save it if he has any respect for his  grandfather - IBTimes India

ఇక జూనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హైదరాబాదులో పాల్గొనక పోవడానికి కారణం ఏంటనే విషయంపై ఆర్జీవి స్పందిస్తూ.. ముందుగా తారక్ కి థాంక్స్ చెప్పారు ఆర్జీవి.. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి మాయలో పడ్డారని చెప్పి టిడిపి నేతలు ఎన్టీఆర్ను ఎందుకు పూజిస్తున్నారంటూ ప్రశ్నించారు ?అలాగే చంద్రబాబుపై కీలక కామెంట్స్ చేశారు.. చంద్రబాబును ముసలి పాముతో పోల్చారు వర్మ నేను ఒక జోక్ చెప్పడానికి విజయవాడకు వచ్చాను.. రాజమండ్రిలో ఆ జోక్ జరుగుతోంది.. నందమూరి కుటుంబంలో ఉన్న ఒకే ఒక్క వారసుడు తారక్..వాళ్ళ పక్కన కూర్చోకూడదని మొన్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు తారక్ హాజరు కాలేదని తెలిపారు.

ముఖ్యంగా కన్ను ఆర్పకుండా ఉండే పాము ముసలి తరువాత చంద్రబాబునే చూశాను అంటూ వ్యాఖ్యలు చేశారు. వ్యూహం చిత్రంలో చంద్రబాబు క్యారెక్టర్ ఏంటో నీటిగా చూపిస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వర్మ. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను చాలా ఘనంగా జరిపించారు.