యంగ్ అండ్ టాలెంట్ హీరో శర్వానంద్ కారు యాక్సిడెంట్ కు గురయ్యాడంటూ ఈ రోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం తెల్లవారు జామున ఫిల్మ్ నగర్ జంక్షన్ దగ్గర ఆయన కారు అదుపు తప్పి బోల్తా పడిండని.. ఈ ప్రమాదంలో గాయాలు పాలైన శర్వానంద్ ను కొందరు స్థానికులు ఆసుపత్రిలో చేర్చారని ప్రచారం జరిగింది.
అయితే తాజాగా కారు యాక్సిడెంట్ పై శర్వానంద్ రియాక్ట్ అయ్యాడు. తన రోగ్య పరిస్థితి ఇప్పుడెలా ఉందో వివరిస్తూ.. ఓ ట్వీట్ చేశాడు. `ఈ ఉదయం నా కారు యాక్సిడెంట్కు గురైందని వార్తలు వచ్చాయి. అది చాలా స్వల్ప ఘటన. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో నేను ఇంట్లో పూర్తిగా సురక్షతంగా, ఆరోగ్యంగా ఉన్నాను.
ఎవరూ చింతించాల్సిన పనిలేదు. నా ఆరోగ్యం పట్ల ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు` అంటూ శర్వానంద్ వెల్లడించారు. దీంతో ఆయన అభిమానుల కాస్త ఊరట చేందారు. అన్నట్లు వచ్చే నెలలో శర్వా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రక్షిత రెడ్డితో ఆయన ఏడు అడుగులు వేయబోతున్నాడు. జూన్ 2, 3 తేదీల్లో రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లోని లీలా ప్యాలెస్లో ఆయన పెళ్లి జరగబోతోంది. ప్రస్తుతం అక్కడ జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.