రామ్ చ‌ర‌ణ్ నిర్మాణంలో `ఇండియా హౌస్`.. హాట్ టాపిక్‌గా హీరో నిఖిల్ రెమ్యున‌రేష‌న్!?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇటీవ‌ల త‌న స్నేహితుడు విక్రమ్ రెడ్డితో కలిసి `వి మెగా పిక్చర్స్` పేరుతో కొత్త నిర్మాణ సంస్థ‌ను స్థాపించిన సంగ‌తి తెలిసిందే. ఈ బ్యాన‌ర్ లో తొలి సినిమాను అనౌన్స్ చేశారు. అదే `ది ఇండియా హైస్‌`. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమా నిర్మాణంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ కూడా భాగం కాబోతోంది.

అలాగే ఇందులో నిఖిల్ సిద్దార్థ హీరోగా ఎంపిక అయ్యాడు. వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. లండన్ నేపథ్యంలో మన ఇండియాకు స్వాతంత్య్రం రాక ముందు కాలంలో సాగే కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో నిఖిల్ శివ అనే యువ‌కుడు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. అలాగే బాలీవుడ్ న‌టుడు అనుపమ్ ఖేర్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు.

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రామ్ వంశీ కృష్ణ అనే కొత్త డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాకు నిఖిల్ అందుకుంటున్న రెమ్యున‌రేష‌న్ హాట్ టాపిక్ గా మారింది. కార్తికేయ 2, 18 పేజెస్ వంటి సూప‌ర్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని మంచి ఫామ్ లో ఉన్న నిఖిల్‌.. ఇంత‌కు ముందుకు ఒక్కో సినిమాకు రూ 6 కోట్ల నుంచి 8 కోట్ల రేంజ్ లో తీసుకునేవాడు. కానీ, `ది ఇండియా హైస్‌` మూవీకి ఆయ‌న రూ. 10 కోట్ల‌కు పైగానే ఛార్జ్ చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.