SSMB 28.. ఒకే పోస్ట‌ర్ ను తిప్పి తిప్పి వేస్తున్న‌ టీమ్‌.. మండిప‌డుతున్న మ‌హేష్ ఫ్యాన్స్‌!

టాలీవుడ్ ప్రిన్స్‌ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో `SSMB 28` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, శ్రీ‌లీల హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతోంది.

 

అయితే నేడు మ‌హేష్ బాబు తండ్రి సూప‌ర్ స్టార్‌ కృష్ణ జ‌యంతి కావ‌డంతో.. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ మరియు ఫ‌స్ట్‌ గ్లింప్స్ వీడియోను సాయంత్రం 6:03 నిమిషాలకు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర టీమ్‌ మూడు రోజుల క్రిత‌మే అన్సౌన్స్ చేసింది. ఈ మేర‌కు మాస్ లుక్ లో ఉన్న మ‌హేష్ బాబు పోస్ట‌ర్ ను రివీల్ చేసింది. అయితే గ‌త మూడు రోజుల నుంచి అటు తిప్పి, ఇటు తిప్పి ఇదే పోస్ట‌ర్ ను వేస్తున్నారు. ఈ రోజు ఉద‌యం కూడా అదే పోస్ట‌ర్ ను రిపీట్ చేశారు.

మ‌హేష్ బాబు మాస్ లుక్ న‌చ్చిన‌ప్ప‌టికీ.. గ్లింప్స్‌ కి సంబంధించిన ఒకే ఒక్క పోస్టర్ ని మూడు యాంగిల్స్ లో విడుదల చెయ్యడం పై మహేష్ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు.. గ్లింప్స్ వీడియో లో ఈ ఒక్క షాట్ మాత్రమే ఉందా?, ఎందుకు ఒకే పోస్టర్ ని తిప్పి తిప్పి వేస్తున్నారు..? అంటూ మూవీ టీం పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమాకు `గుంటూరు కారం` అనే టైటిల్ ప‌రిశీల‌న‌తో ఉంది. దాదాపు ఇదే క‌న్ఫార్మ్ అని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.