తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పూజా హెగ్డే గురించి ఆమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా తన నటనతో అందంతో కుర్రకారులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ఇతర భాషలలో సైతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమా మీది ఏమే పూర్తిగా నమ్మకంతో ఉన్నది.
గత సంవత్సరం నుంచి వరుస ప్లాపులతో సతమతమవుతున్న పూజా హెగ్డే ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ రాలేదని చెప్పవచ్చు. నిన్నటి రోజున మాతృ దినోత్సవం సందర్భంగా పూజ హెగ్డే తన తల్లి లతా హెగ్డే తో కలసి ఒక బాలీవుడ్ మీడియాతో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.అందులో పలు ఆసక్తికరమైన విషయాలను సైతం పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే యాంకర్ పూజా హెగ్డే కు ఎలాంటి భర్త కావాలి అని తన తల్లిని అడగగా.. లతా స్పందిస్తూ తనని అన్ని రకాలుగా అర్థం చేసుకునే వ్యక్తి కే తనని ఇచ్చి వివాహం చేస్తానని తెలియజేస్తోంది.
ముఖ్యంగా వివాహ బంధం కలకాలం నిలిచి ఉండాలి అంటే భార్య భర్తలు ఇద్దరు కష్టపడాలి . ఒకరినొకరు అర్థం చేసుకోవాలి గౌరవించుకోవాలి పూజా చాలా సున్నిత మనసు కలిగిన అమ్మాయి ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకొని వ్యక్తి అయితే తనకు కరెక్ట్ జోడి అంటూ తెలియజేసింది పూజా హెగ్డే తల్లి లత. ప్రస్తుతం పూజా హెగ్డే తల్లి పూజా హెగ్డే పెళ్లిపన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అలాగే పూజ హెగ్డే తన తల్లితో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా తెలియజేయడం జరిగింది.