`విరూపాక్ష‌` ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా.. సాయి ధ‌ర‌మ్ తేజ్ కెరీర్ లోనే హ‌య్యస్ట్‌!?

మెగా మేన‌ల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ తాజాగా `విరూపాక్ష‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో సాయి ధ‌ర‌మ్ తేజ్ కు జోడీగా సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. కార్తీక్ వర్మ దండు ఈ మూవీకి దర్శకత్వం వహించ‌గా.. సుకుమార్ క‌థ‌, స్క్రీన్ ప్లే అందించాడు.

హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నిన్న భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి.. మొద‌టి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా ఉండ‌టంతో బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఇక‌పోతే తాజాగా విరూపాక్ష ఓటీటీ డీల్ క్లోజ్ అయింది.

‘విరూపాక్ష’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తమ డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామి నెట్ ఫ్లిక్స్ అని థియేటర్లలో నిర్మాతలు తెలిపారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ రూ. 18 కోట్లు ప‌లికిన‌ట్లు ఇన్‌సైడ్ టాక్ న‌డుస్తోంది. ఇది సాయి ధ‌ర‌మ్ తేజ్ కెరీర్ లోనే హ‌య్య‌స్ట్ డీల్ గా చెప్పుకోవ‌చ్చు. ఇక థియేట‌ర్స్ లో విడుద‌లైన ఆరు వారాల త‌ర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది.