త్రివిక్రమ్-మోక్షజ్ఞ కాంబో అదుర్స్ అంటున్న నందమూరి ఫ్యాన్స్.. అదే హైలెట్ అట!

నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఇక ఆయన వారసుడు మోక్షజ్ఞ త్వరలోనే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. గత రెండు, మూడేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ప్రచారం జరుగుతుంది. అయితే 2025లో కచ్చితంగా మోక్షజ్ఞ సినిమా వస్తుందని గట్టిగా ప్రచారం జరుగుతుంది. తాజాగా మోక్షజ్ఞ కోసం బాలయ్య కథలు కూడా వింటున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చెయ్యనున్నారు. ఈ విషయం తెలిసి బాలయ్య అభిమానులు ఎంతగానో సంతోష పడుతున్నారు.

అలానే దర్శకుడు త్రివిక్రమ్ కొడుకు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. త్రివిక్రమ్ కి ఇద్దరు కుమారులు. వారిలో ఒకరు దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నారట. ఈ విషయాని స్వయంగా త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య చెప్పారు. ఆమె గత కొన్నేళ్లుగా వరుస సినిమాలను నిర్మిస్తున్నారు. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు త్వరలోనే దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పింది.

అంతేకాకుండా సినిమా మేకింగ్ విషయంలో తమ కుమారుడికి వచ్చే సందేహాలు వారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అని సాయి సౌజన్య చెప్పారు. ఇక ఒకవైపు బాలయ్య బాబు కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇంకోవైపు త్రివిక్రమ్ కొడుకు దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ గా ఉన్నాడు. ఇదంతా చూస్తుంటే వారిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే చాలా బాగుంటుందని కొంతమంది సినీ ప్రేక్షకులకు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి వారి కోరిక ఫ్యూచర్ లో నెరవేరుతుందా లేదా అనేది చూడాలి.