బాలయ్య ఇండస్ట్రీ హిట్ సినిమా వదులుకున్న నలుగురు హీరోయిన్లు వీళ్లే..!

చాలా మంది హీరోలు, హీరోయిన్లు క‌థ న‌చ్చకో లేదా ఇత‌ర కార‌ణాల వ‌ల్లో కొన్ని సినిమాల‌ను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అలా వ‌దులుకున్న సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్లు అవుతుంటాయి. అలా నందమూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన అఖండ సినిమాను కూడా న‌లుగురు హీరోయిన్లు మిస్ అయ్యారు. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా న‌లుగురు హీరోయిన్ల‌కు ముందుగా అఖండ సినిమాలో న‌టించే ఛాన్స్ వ‌చ్చింది. అయితే వారంద‌రు ఈ సినిమాను రిజెక్ట్ చేసుకోవ‌డంతో చివ‌ర‌కు ఆ ల‌క్కీ ఛాన్స్ ప్ర‌గ్య జైశ్వాల్‌కు ద‌క్కింది.

అలా కెరీర్ ఎండ్ అయిపోతోన్న ద‌శ‌లో ప్ర‌గ్య‌కు మంచి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ద‌క్కింది. అయితే అఖండ సినిమాలో ప్ర‌గ్య హీరోయిన్ కాగా.. మ‌రో హీరోయిన్ పూర్ణ కీల‌క పాత్ర‌లో క‌నిపించింది. శ్రీకాంత్ విల‌న్‌గా, జ‌గ‌ప‌తిబాబు మెయిన్ విల‌న్‌గా క‌నిపించారు. గ‌తంలో బాల‌య్య – బోయ‌పాటి కాంబినేష‌న్లో వ‌చ్చిన సింహా, లెజెండ్ సినిమాల‌ను మించి అఖండ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది.

అఖండ‌లో హీరోయిన్‌ను సెట్ చేసేందుకు బోయ‌పాటి చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింద‌ట‌. ప్రగ్యా జైస్వాల్ కంటే ముందు ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం న‌లుగురిని సంప్ర‌దించారు. వారంద‌రూ కూడా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో నో చెప్పారు. ముందు బ‌క్క‌ప‌ల్చ‌ని భామ‌ రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదించారట. ఆమె బోయ‌పాటి సరైనోడు, జయ జానకి నాయక సినిమాల‌లో హీరోయిన్‌గా న‌టించింది. ఆ కార‌ణంతోనే బోయ‌పాటి అడిగినా ఆమె నో చెప్పేసింది.

ఆ త‌ర్వాత కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను అడిగారు. ఆమె కూడా చిరంజీవి ఆచార్య‌లో చేసే ఉద్దేశంతో అఖండ‌కు నో చెప్పేసింది. త‌ర్వాత బోయ‌పాటి స‌రైనోడు సినిమాలో ఎమ్మెల్యే పాత్ర‌లో న‌టించిన కేథ‌రిన్ థెస్రాను అడిగార‌ట‌. ఆమె కూడా ఎస్ అన‌లేదు. చివ‌ర‌కు ప్ర‌గ్య జైశ్వాల్‌ను సంప్ర‌దించ‌గా ఆమె ఓకే చెప్పింది. అలా కెరీర్ ఎండ్ అవుతుంద‌నుకుంటోన్న టైంలో ప్ర‌గ్య‌కు అదిరిపోయే బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డింది.