శ్రీలత రెడ్డి అంటే ఎవరికి తెలియదేమో కాన్నిరోజా అంటే మత్రం అందరికి భాగా తెలుసు. టాలీవుడ్లో దాదాపు మూడు దశాబ్దాలకు పైగా రోజా కోనసాగుతుంది. ఇక కెరీర్ ఆరంభంలో చిన్నాచితకా పాత్రలు వేసుకుంటూ హీరోయిన్గా నిలదొక్కుకున్న రోజా.. ఆ తర్వాత వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ కొన్ని ఏళ్లపాటు టాలీవుడ్ను షేక్ చేసింది.
ఇక ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలో బీజిగా ఉంది. ఒక సాధారణ హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన రోజా ఈరోజు ఏకంగా రాజకీయాల్లో రాణించడంతో పాటు మంత్రి స్థాయికి ఎదిగారు. 50 ఏళ్లకు దగ్గరైన రోజా ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీగా తన అందాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కోలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శకుడు సెల్వమణిని రోజా ప్రేమ వివాహం చేసుకున్నారు.
రోజా పుట్టిన కొద్ది రోజులకే ఆమె కుటుంబం హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది. అయితే రోజా మాత్రం తన డిగ్రీని తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఆమె హీరోయిన్ అవ్వకముందు కూచిపూడి డ్యాన్సర్ గా ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చింది. ఇక రోజా స్టార్ హీరోయిన్గా అటు రాజకీయాలో మంత్రిగా ఇంత పేరు తెచ్చుకోవటం వెనక ఓ వ్యక్తి ఉన్నారు. ఆయనే రోజా తన గురువుగా భావిస్తూ ఉంది. ఇక ఆయన మరీ ఎవరో కాదు దివగంత మాజీ నటుడు మాజీ ఎంపీ ఎన్. శివప్రసాద్.
రోజా హీరోయిన్గా నటించిన తోలి సినిమా `ప్రేమ తప్పస్సు` ఆ సినిమాను శివప్రసాద్ తెరకెక్కించారు. అయితే ఆమెకు నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది మత్రం శోభన్ బాబు హీరోగా వచ్చిన సర్పయాగం.. సినిమాతో ఆమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే రోజాను నటిగా ప్రోత్సహించింది మాత్రం శివప్రసాద్ అనే చెప్పలి. అయితే రోజాకు 1992లో ఇవి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సీతారత్నం గారి అబ్బాయి సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. అప్పటినుంచి ఆమె వెనక్కు తిరిగి చూసుకోలేదు.