తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికి సాధ్యం కానీ రీతులో నట సార్వభౌముడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో నందమూరి తారకరామారావు ఒకరు.. ఆయన ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించారు. ఆయన తర్వాత నందమూరి కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన వారిలో ప్రస్తుతం బాలకృష్ణ- ఎన్టీఆర్- కళ్యాణ్ రామ్ టాలీవుడ్ లో స్టార్ హీరోలోగా కొనసాగుతున్నారు. బాలకృష్ణ తన కెరీర్ ప్రారంభంలో తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు.
ఆయన మొదటి సినిమా తాతమ్మ కల ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు ఆ సినిమాలో ఎన్టీఆర్ కూడా నటించారు.. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో కూడా ఎన్టీఆర్ -బాలకృష్ణ కలిసి నటించారు. బాలకృష్ణ అప్పుడే టాలీవుడ్ లో తన కెరీర్ ప్రారంభిస్తున్న సమయంలో ఎన్టీఆర్ -బాలకృష్ణతో కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేయాలని ఎస్ వెంకటరత్నం అనుకున్నారట. ఆ సందర్భంలోనే ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్లి కథ చెప్పారట.. కథ మొత్తం విన్న తర్వాత పాత్ర ఎంతో వైవిధ్యమైనదని.. అప్పుడప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న బాలకృష్ణ ఆ పాత్రలో నటించలేడని.. ఆ పాత్ర నేను చేస్తానని దర్శక నిర్మాతలకు చెప్పి పంపించారట.
సాధారణంగా ఎవరైనా సరే కొడుకు మంచి సినిమా అవకాశం వస్తే నటింపజేయాలని చూస్తారు.. వైవిద్యమైన సినిమాలు వస్తే కొడుకు మంచి పేరు వస్తుంది కచ్చితంగా ఆ సినిమాలో తమ కొడుకుని నటింపజేయాలని దర్శక నిర్మాతలను పట్టుబడతారు. ఎన్టీఆర్ కథలో ఉన్న బలాన్ని చూసి బాలకృష్ణ చేయలేడు.. సినిమా విడుదలయ్యాక సినిమా పోతే దర్శక నిర్మాతలు ఇబ్బంది పడతారని ఎన్టీఆర్ ఆ సినిమాలో తానే నటించాడు.
1977లో ఎన్టీఆర్ హీరోగా కైకాల సత్యనారాయణ యముడిగా తాతినేని రామారావు దర్శకత్వంలో వచ్చిన సినిమా యమగోల.. అప్పట్లో ఈ సినిమా ఎన్నో సంచలమైన రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాను ముందుగా బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ తో యముడు పాత్ర చేయించాలని అనుకున్నారట.. ఎన్టీఆర్ ఈ సినిమా బాలకృష్ణకు వద్దని చెప్పడంతో.. సినిమాలు హీరోగా ఎన్టీఆర్ నటించాడు.. కైకాల సత్యనారాయణ తో యముడి పాత్ర చేయుద్దామని దర్శక నిర్మాతులకు ఎన్టీఆర్ చెప్పాడట. తర్వాత సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది.