ఇద్దరు వ్యక్తులను తుపాకీతో కాల్చావ్.. బాలయ్య పై పోసాని సంచలన వ్యాఖ్యలు..!!

టాలీవుడ్లో నటుడు బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. నటన పరంగా ఎంతోమంది అభిమానులను సంపాదించారు. అప్పుడప్పుడు బాలకృష్ణ కోపడుతూ ఉండడం వల్ల బాలకృష్ణ పైన రూమర్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా నటుడు పోసాని కృష్ణ మురళి బాలయ్య పైన ఫైర్ అవడం జరిగింది.. బాలయ్య మాట్లాడిన మాటలకు సైతం పోసాని కృష్ణ మురళి గట్టిగా ఉంటారు ఇచ్చారు.

బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ సీఎం ను ఒక సైకో అంటున్నారని ఎవరు సైకోనో ఒకసారి ఆత్మవివాసం చేసుకోవాలని పోసాని గట్టి సటైర్ వేశారు. రీసెంట్గా జరిగిన హైదరాబాదులో ఒక కార్యక్రమంలో పాల్గొన్న మీడియా మాట్లాడడం జరిగింది.. బాలకృష్ణ గారు తన సొంత తుపాకీతో ఇద్దరిని కాల్చేశారని మంచి వాళ్ళైతే అలా కాలుస్తారా ..ఇప్పుడు చెప్పండి ఎవరు సైకోనో కాల్చినాక కూడా ఆయన అసలు జైలు శిక్ష కూడా అనుభవించలేదు. అదే పని మనలాంటి వారు చేసి ఉంటే తీసుకువెళ్లి జైలులో పెట్టేవారు కోర్టుకు వెళ్లి శిక్ష వేయించేవారు అంటూ తెలియజేశారు పోసాని.

సరే ఇదంతా వదిలేస్తే మరొకసారి తన ఇంటి గేటు వాచ్మెన్ కూడా తన కళ్ళ ముందే మరణిస్తే అతని శవం చూడకుండానే మేకప్ వేసుకొని మరి షూటింగ్ కి వెళ్ళిపోయారు..ఈ విషయంలో ఎవరైనా సరే బాలకృష్ణ అని ప్రశ్నించారు ఎవరు ఇలాంటి పనులు చేస్తారు.. ఎవరు సైకో మరి జగన్ మోహన్ రెడ్డి గారిని ఇందులో ఏ ఒక్క పని అయినా చేశారా నువ్వు నీ అభిమానులను కొడతావు జగన్ ఆ పని అస్సలు చేయడు కదా నువ్వు ఆడవారిని అసభ్యకరంగా మాట్లాడుతావు జగన్ ఎప్పుడూ కూడా అలాంటి పని చేయలేదు.. కనీసం అరేయ్ అన్నాను కూడా మాట వినలేదు ఎవరు సైకో అంటూ పోసాని రెచ్చిపోయారు.